అబ్దుల్లాపూర్మెట్ : డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపికపై బండరావిరాల గ్రామంలో తహసీల్దార్, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో నిర్మించిన 35 ఇండ్ల నిర్మాణం పై అధికారులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనితారెడ్డి మాట్లాడుతూ మీ సేవ ద్వారా 604 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గ్రామంలో డబుల్బెడ్ రూం దరఖాస్తులను ప్రతి ఇంటికి వచ్చి విచారణ చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ వినోద, ఆర్ఐ సత్యనారాయణ ఉన్నారు.
ఆదిబట్ల : అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం అందేలా కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ కళమ్మ, కోఆప్షన్ సభ్యులు పల్లె గోపాల్గౌడ్, కౌన్సిలర్ మర్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపికపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
అర్హుందరికీ డబుల్బెడ్రూం
మొయినాబాద్ : అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొదించిందని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అన్నారు. బుధవారం మండల పరిధిలోని అజీజ్నగర్ గ్రామంలో సర్పంచ్ సంధ్య, సురంగల్ గ్రామంలో సర్పంచ్ గడ్డం లావణ్య అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలని చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్రావు ప్రజలకు అవగాహన కల్పించారు. దళారులను ఆశ్రయించి మోస పోవద్దన్నారు. కార్యక్రమంలో వినయ్సాగర్, దీపలత, జయవంత్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.