తుక్కుగూడ మరో హైటెక్ సిటీగా మారనున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తుక్కుగూడ, రావిర్యాలలో రూ. 8 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా, ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులతో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే సర్కారు ధ్యేయమన్నారు. కుల వృత్తులవారికి రూ.లక్ష సాయం అందిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఒకప్పుడు తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఉండేవని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందన్నారు. ఇప్పటికే తుక్కుగూడ ప్రాంతానికి 50 కంపెనీలు వచ్చాయని, మరో 9 నెలల్లో ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు.
– మహేశ్వరం, అక్టోబర్ 9
మహేశ్వరం, అక్టోబర్ 9: ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు.. తుక్కుగూడ భవిష్యత్తులో మరో హైటెక్సిటీగా మారనున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తుక్కుగూడ, రావిరాలలో రూ. 8 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, నూతన పనులకు ఆమె శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. ఈ ప్రాంతం ఫ్యాబ్ సిటీ, ఫా ర్మాసిటీ, ఫ్యాక్స్కాన్ కంపెనీల రాకతో రానున్న కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి చెందనున్నదన్నారు. ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ మెట్రోలైన్ను తీసుకురావడం కూడా ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. తుక్కుగూడకు ప్రతీకక నిలిచే బురుజు అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయించి శంకుస్థాపన చేసి, బతుకమ్మఘాట్ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
తుక్కుగూడ మున్సిపాలిటీకి ఇప్పటివరకు రూ.50కోట్లు కేటాయించగా పనులు జరుగుతున్నారు. ఐటీశాఖ మంత్రి కృషితో లైట్ల నిర్మాణానికి రూ. 5కోట్ల50 లక్షలను మంజూరైనట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 10 చెరువులకు రూ.40 కోట్లతో సుందరీకరించినట్లు, అదేవిధంగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరా ల పెద్ద చెరువు సుందరీకరణకు రూ.6కోట్ల 50లతో పనుల ను ప్రారంభించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అది మానవీయ కోణంతో కూడుకుని ఉంటుందని కొనియాడారు. కుల వృత్తుల వారికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తున్నదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని.. ఇక్కడి పథకాలను ఇతర రాష్ర్టాల్లోని పాలకులు అమలు చేస్తున్నారన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు అం దుతున్నదని ఆమె గుర్తు చేశారు. రూ. 200 పింఛన్ను రూ. 2,000, రూ. 3,000 పింఛన్ను రూ.4,000 వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఇప్పటికే తుక్కుగూడ ప్రాంతానికి 50 కంపెనీలు వచ్చాయని .. మరో 9 నెలల్లో ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణం కూ డా పూర్తైతే లక్షకుపైగా ఉద్యోగాలు స్థానికులకు లభిస్తాయన్నారు. రానున్న ఎన్నిక ల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు మంత్రి తు క్కుగూడలో వాటర్ బోర్డు ఏర్పాటు చేసిన ట్యాంకును ప్రారంభించారు. కార్యక్రమంలో చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీవెంకట్రెడ్డి, కమిషనర్ వెంకట్రామ్, కౌన్సిలర్లు రవీనాయక్, లావణ్యారాజు ముదిరాజ్ , తేజస్వినీశ్రీకాంత్గౌడ్, సుమన్, బీఆర్ఎస్ పా ర్టీ పట్టణాధ్యక్షుడు లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామెల్ రాజు, మహిళా అధ్యక్షురాలు పద్మాభాస్కర్రెడ్డి, సురేశ్, యాదగిరి పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి పెద్దపీట
ఆర్కేపురం : రాష్ట్రంలోని అన్ని ఆలయా ల్లో ప్రతిరోజూ ధూప, దీప, నైవేద్యాలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యాశాఖ మం త్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో రూ. కోటితో జరుగనున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. నియోజకవర్గంలోని పురాతన ఆలయాలను రూ.8 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మణ పరిషత్ భవనాన్ని ప్రారంభించి సీఎం కేసీఆర్ బ్రహ్మణులకు అనేక వరాలు ఇచ్చారన్నారు.