వికారాబాద్, మార్చి 24 : క్షయ వ్యాధి లక్షణాలపై అందరికీ అవగాహన కల్పించి.. నివారణకు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశ వ ర్కర్లు, పాఠశాల విద్యార్థులతో కలిసి క్షయ వ్యాధి నివారణ ర్యాలీని చేపట్టగా.. దానిని కలెక్టర్ జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్లకార్డులతో కలెక్టరేట్ నుంచి జిల్లా కేంద్రంలో ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో పాల్వన్కుమార్, క్షయ వ్యాధి ప్రాజెక్టు అధికారి డాక్టర్ రవీందర్ యాదవ్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ పాల్గొన్నారు.
క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యత
షాద్నగర్ టౌన్, మార్చి 24 : క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యత అని జిల్లా మాస్ మీడియా అధికారి నరహరి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినాన్ని పురస్కరించుకుని ఫరూఖ్నగర్ మం డలం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పట్టణంలోని ఇంద్రానగర్కాలనీలోని హెల్త్ సెంటర్లో శుక్రవారం క్షయ వ్యాధిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షయవ్యాధి బారినపడకుం డా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధిగ్రస్తులు పోషకాహారంతోపాటు మందులను వాడాలన్నారు. ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. క్షయ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉం డాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, టీ.బీ సూపర్వైజర్ రవికుమార్, డాక్టర్ రమాదేవి, హెల్త్ సూపర్వైజర్లు చంద్రకళ, శ్రీరామ, తుకారం, ఏఎన్ఎంలు భారతి, రమాదేవి, ఆశలు, కాలనీవాసులు పాల్గొన్నారు.