షాబాద్, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధ్దంతి సందర్భంగా చేవెళ్ల, శంకర్పల్లి మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా షాబాద్, మొయినాబాద్ మండలాల్లో ప్రజాప్రతినిధులు, యువకులు అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాలర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మా ట్లాడుతూ.. రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఆయా మం డలాల ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో..
ఇబ్రహీంపట్నం : అంబేద్కర్ వర్ధంతిని మంగళవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా పలుపార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కప్పరి స్రవంతి, ఇబ్రహీంపట్నం మున్సిప్కోర్టులో సీనియర్ సివిల్జడ్జి ఇందిర, మంచాలలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మంచాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో, తుర్కయాంజాల్ మున్సిపల్ కేంద్రంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఆధ్వర్యంలో, యాచారం మండల కేంద్రంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, పెద్దఅంబర్పేట్ మన్సిపాలిటీతో పాటు అబ్దుల్లాపూర్మెట్ మండల వ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు.
అంబేద్కర్ దేశానికి ఆదర్శవంతుడు
ఆమనగల్లు: అంబేద్కర్ దేశానికి ఆదర్శవంతుడని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నా రు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్యే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండలాల నాయకులు పాల్గొన్నారు
గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్
షాద్నగర్/షాద్నగర్రూరల్ : అంబేద్కర్ గొప్ప సంస్కర్త అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతిని నియోజకవర్గంలోని షాద్నగర్, నందిగామ, కొత్తూరు, కేశంపేట, కొందుర్గ మండలాల వ్యాప్తంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. షాద్నగర్ పట్టణంలోని ముఖ్యకూడలిలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఫరూఖ్నగర్ మండల జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. నందిగామలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్తూరు మండల కేంద్రంలోని వై.జంక్షన్ వద్ద మున్సిపల్ చైర్మన్ బాతుక లావణ్యాదేవేందర్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో మధుసూదన్రెడ్డి, తిమ్మాపూర్లో మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి
కడ్తాల్ : అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు పరమేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల, కుల, యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు సులోచన, భారతమ్మ, యాదయ్య, తులసీరాంనాయక్, కృష్ణయ్య, విజయలక్ష్మి, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, శ్రీనివాస్రెడ్డి, లాయక్అలీ, మంజుల, జహంగీర్బాబా, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వినోద్, శారద, బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు చందోజీ, నరేందర్రెడ్డి, యాదగిరిరెడ్డి, భిక్షపతి, రామచంద్రయ్య, నర్సింహ పాల్గొన్నారు.
మాడ్గుల : మండల వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ, ఎంపీటీసీలు కిషన్రెడ్డి, గ్యార వెంకటయ్య, రాములు, ఉప సర్పంచ్ శేఖర్, అంజయ్య, భూదేవి తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : తలకొండపల్లి, గట్టుఇప్పలపల్లి, వెల్జాల్, చుక్కాపూర్, అంతారం, చంద్రధన, జూలపల్లి, పడకల్, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు లలిత, శ్యాంసుందర్రెడ్డి, రమేశ్యాదవ్, కుమార్, చంద్రయ్య, ఉపసర్పంచ్ మల్లేశ్, నాయకులు కుమార్, చెన్నయ్య, పాండు పాల్గొన్నారు.