దండుగ అన్న వ్యవసాయం తెలంగాణ ప్రభుత్వ హయాంలో పండుగలా మారింది. ఏటా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో కరువు ఛాయలు కనుమరుగయ్యాయి. రాష్ట్ర సర్కార్ చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో చెరువులు, కుంటల పునరుద్ధరణ, చెక్ డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా ఈ తొమ్మిదేండ్లలో వ్యవసాయ సాగు మూడింతలైంది. రంగారెడ్డి జిల్లాలో 4.87లక్షల ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 3 లక్షల ఎకరాలకుపైగా సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో నాట్లు వేయడం, కలుపు తీయడం తదితర పనులతో ఏడాది పొడవునా అన్నదాతలతోపాటు కూలీలు బిజీగా గడుపుతున్నారు. దుక్కులు దున్నడంతోపాటు, గొర్లు కొట్టేందుకు, ఎరువులు చల్లడం వంటి పనులు చేసేందుకు ట్రాక్టర్లకైతే తీరిక ఉండడం లేదు. పంట చేతికొచ్చిన సమయంలో హార్వెస్టర్లకు భలే గిరాకీ లభిస్తున్నది. ధాన్యం కొనుగోళ్ల సమయంలో లారీలకు పని దొరుకుతుండగా, రైస్ మిల్లుల్లోని హమాలీలకూ ఉపాధి లభిస్తున్నది. మొత్తానికి సాగు సంబురంగా మారి ఎంతో మందికి ఉపాధి లభిస్తుండడం గమనార్హం. – రంగారెడ్డి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కరువుఛా యలు కనుమరుగయ్యాయి. సాగుకు అనుకూల పరిస్థితులొచ్చాయి. నాగలి చిందేస్తున్నది. 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ, రైతు బంధు వంటి పథకాలు సాగుకు ఊతమివ్వడంతో వ్యవసాయం జోరు మీదున్నది. వలసవెళ్లిన వారు కూడా సొంతూళ్లకు తిరిగొచ్చి వ్యవ సా యం చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్లు, విద్యావంతులూ వ్యవసాయ సా గు దిశగా అడుగులు వేస్తున్నారు. ఫలితంగా.. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 1.40 లక్షల ఎకరాల్లోనే ఉన్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం 4.87 లక్షలు దాటింది. పొట్ట చేత పట్టుకునే పరిస్థితులు దూరమై రైతులు, కూలీలకు ఏడాది పొడవునా చేతినిండా పని ఉంటున్నది. ఇదే క్రమంలో ఆధునిక పద్ధ్దతులను రైతాంగం అనుసరిస్తుండటంతో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతోపాటు ఇతర పనులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వినియోగం పెరి గి యజమానులకు గిరాకీ పెరిగింది. ప్రభుత్వం ప్రతి సీజన్లోనూ చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లతో లారీ యజమానులతోపాటు హమాలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇలా…అనేక వర్గాలకు పుష్కలంగా ఉపాధి దొరుకుతున్నది.
తొమ్మిదేండ్ల కిందట జిల్లాలోని అన్నదాతలకు బతుకన్నదే లేదు. సీఎం కేసీఆర్ సంకల్పంతో ఈ ప్రాంతంలో సాగు నీటి సమస్య చాలావరకు తీరింది. ఎటుచూసినా పంట పొలాలతో పచ్చదనం కనిపిస్తున్నది. 2014లో 1.4 లక్షల ఎకరాల్లోపే ఉన్న సాగు నేడు మూడింతలై 4.87లక్షల ఎకరాలకు చేరింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల జలాల రాకతో రానున్న రోజుల్లో ఈ ప్రాంత పరిస్థితి మరింత మెరుగుపడనున్నది. మిషన్ కాకతీయ పథకం ఫలితంగా.. ఎటు చూసినా జలకళను సంతరించుకున్న చెరువులు, కాల్వలు.. పచ్చదనంతో కూ డిన పంట భూములే కన్పిస్తున్నాయి. ఉచిత కరెంటు, రైతుబంధు , రైతుబీమా, పంటలకు మద్దతు ధర వంటి ఎన్నో పథకాలు అమలవుతుండడంతో రైతు కుటుంబాలు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నాయి. ఏటా రెండు పంటలు పండించుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నాయి. నీళ్లు లేక భూములను పడావుగా ఉంచి ఒకప్పుడు కూలీ పనులకు వెళ్లిన రైతులు తమ భూముల్లో రెండు పంటలూ పండించుకుంటున్నారు. కూలీ పనుల కోసం పక్క ఊర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంతూళ్లల్లోనే కూలీలకు ఉపాధి లభిస్తున్నది.
వికారాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా చేపట్టిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో జిల్లాలోని జలవనరుల్లో నీటి నిల్వ సామర్థ్యం భారీగా పెరిగింది. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులతో కృష్ణా జలాల్లో మన వాటా జలాలను వాడుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. జిల్లాలో మొదటి, రెండు, మూడు, నాలుగు విడుతల్లో చేపట్టిన పూడికతీత పనులతో ఐదు టీఎంసీలకు పైగా వృథాగా పారే కృష్టా జలాలను ఒడిసి పట్టే అవకాశం ఉంది. గతంలో చెరువులు, కుంటల కట్టలకు పలు చోట్ల గండ్లు, తూ ములకు లీకేజీలతోపాటు అలుగులు పారడం వల్ల కురిసిన వర్షం నీరు ఎక్కువగా వృథాగా పోయేది. దాదాపు అన్ని చెరువులకు మరమ్మతులు చేయడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. గతంలో సగటున 20-30 ఎకరాలకు నీరందించే చెరువు మిషన్ కాకతీయ పనులతో 120 -130 ఎకరాలకు నీరందించే స్థాయికి చేరుకున్నది. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి చెరువుల్లో పూడిక తీత పనులతో కనీసం 500 మిలియన్ క్యుబిక్ ఫీట్ల (5 టీఎంసీల)వృథాగా పారే కృష్టా జలాలను చెరువుల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు చెరువులకు ప్రస్తుతమున్నది.
అంతేకాకుండా మిషన్ కాకతీయ పనులతో జిల్లాలోని చెరువులు వేసవిలోనూ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. మండు వేసవిలోనూ జిల్లాలోని దాదాపు వెయ్యికిపైగా చెరువుల్లోనూ 90 శాతం మేర నీటి నిల్వలుండడం గమనార్హం. మరోవైపు చెరువుల్లో నీటి నిల్వలు, భూగర్భజలాలు పెరుగడంతో జిల్లావ్యాప్తంగా ఆయా పంటల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. జిల్లాలో 2014 అక్టోబర్లో 2.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులతో ప్రస్తుతం జిల్లాలో 6 లక్షల ఎకరాలకుపైగా ఆయా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే నీటినిల్వలు , సాగు విస్తీర్ణం భారీగా పెరుగడంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వినియోగం కూడా పెరిగింది. రైతులతోపాటు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారికి కూడా గ్రామాల్లోనే జీవనోపాధి లభిస్తున్నది. గతంలో ముంబై, బెంగళూరు తదితర రాష్ర్టాలకు వలస వెళ్లిన రైతులు నీటి వనరులు పెరుగడం, 24 గంటల కరెంట్ సరఫరా తదితర వ్యవసాయ ప్రాధాన్యత అంశాలతో స్వగ్రామాలకు తిరిగొచ్చి సంతోషంగా సాగు పనులు చేసుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు పైగా..
ఉపాధి అవకాశాలు లేక అవస్థలు పడుతున్న సందర్భాలు ఇతర రా ష్ర్టాల్లో కనబడుతుండగా..తెలంగాణలోని పల్లెల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పంట దిగుబడులు పెరిగిన నేపథ్యంలో దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొంటున్నది. ప్రతి సీజన్లోనూ 30-40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటున్నది. దీనివల్ల అనేక వర్గాలకు ఉన్న ఊర్లోనే ఉపాధి అవకాశా లు పుష్కలంగా లభిస్తున్నాయి. స్థానిక కూలీలే హమాలీలుగా పనిచేస్తూ ఉపాధి పొందుతుండగా..కేంద్రాల నిర్వహణతో వచ్చే కమీషన్తో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక చేయూతను పొం దుతున్నా రు. టార్పాలిన్లను అద్దెకు ఇ చ్చి సమకూర్చడం ద్వారానూ కొందరు ఉపాధి పొందుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ట్రాక్టర్లతోపాటు లారీలకు సైతం భలే గిరాకీ ఉంటున్నది.
రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో భూగర్భ జలా లు భారీగా పెరిగాయి. దీంతో బోరుబావుల్లో నీటిమట్టం పెరిగి అన్నదాతలు తమ పంటలను సంతోషంగా సాగు చేసుకుంటున్నారు. పంటల సాగులో ట్రాక్టర్ల వినియో గం విరివిగా పెరుగడంతో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. సీజన్ల సమయంలో తీరిక లేకుండా పని లభిస్తున్నది. ఆర్థికంగా ఎదుగుతున్నాం.
లారీలకు గిరాకీ ఫుల్
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్ల సీజన్లో లారీలకు డిమాండ్ పెరిగింది. ప్రతిఏటా రెండుసార్లు ఐకేపీల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుండడంతో.. సీజన్ లో రెండు నెలలపాటు లారీలకు ఫుల్ గిరాకీ ఉంటున్నది. దీంతో ఏటా నాలుగు నెలలపాటు సమయం తీరిక ఉండ టం లేదు. ఆదాయం కూడా బాగున్నది.
-సయ్యద్సాధిక్, తెలంగాణ లారీల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, షాద్నగర్
వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో బోరుబావులు నీటితో కళకళలాడుతున్నాయి. నాకు ఏడెకరాల పొలం ఉండగా.. మరో మూడు ఎక రాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, కంది పంటలను సాగు చేస్తున్నా. ప్రభుత్వం ప్రతిఏటా ఏడాదికి రెండుసార్లు అందిస్తున్న రైతుబంధు పెట్టుబడిసాయంతో అవసరమైన ఎరువులు, విత్తనాలను కొంటున్నా. పొలాల్లో కలుపు తీసేందుకు కొంతమందికి పని కల్పిస్తు న్నా. సీజన్ సమయంలో కూలీలు దొరకడంలేదు. మిగిలిన సమయంలో ఇబ్బందిలేదు. పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నా.
వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడం తో భూగర్భజలాల నీటిమట్టం బా గా పెరిగింది. దీంతో వివిధ రకాల పంటలను సకాలంలో సాగు చేస్తు న్నా. ప్రభుత్వం ఏడాదికి రెండు సీజన్లలో అందిస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయంతో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలను కొంటున్నా. సాగుకు చింతలేదు. ఉపాధి కూడా పుష్కలంగా లభిస్తు న్నది
-లింగారెడ్డి, మల్కీజ్గూడ, ఇబ్రహీంపట్నం
పెరిగిన సాగు విస్తీర్ణం
గతంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడంతో అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అం డగా ఉండి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమివ్వడంతో మండలంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. నేను వరికోత యంత్రాన్ని తీసుకురాగా సీజన్ సమయంలో మంచి గిరాకీ ఉన్నది. ఆదాయం కూడా బాగున్నది. దాదాపుగా రెండు నెలలపాటు తీరిక లేకుండా పని దొరుకుతున్నది.
-శరత్, సోలిపూర్, షాద్నగర్
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సాగు విస్తీ ర్ణం పెరిగింది. సర్కారు తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయం పండుగలా సాగుతున్నది. స్థానికం గా ఉపాధి పొందేందుకు వరికోత యంత్రాన్ని తీసుకురాగా గిరాకీ బాగున్నది. ఆదాయం బాగానే వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను తగ్గించకపోవడంతో లాభాలు తక్కువగా వస్తున్నా యి. కేంద్రం వెంటనే డీజిల్ ధరలను తగ్గించాలి.
-మనోహర్,అన్నారం గ్రామం, ఫరూఖ్నగర్
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నదాతలకు మంచి రోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నది. దీంతో నాకున్న ఆరు ఎకరాల పొలంలో వరి, పత్తి, కంది, నిమ్మతోట, టేకు చెట్లను పెంచుతున్నా. తమ కుటుంబం ఏ రంది లేకుండా బతుకుతూ గ్రామంలోని పలువురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నా.
– రామచంద్రారెడ్డి, రైతు దాతాపూర్ నవాబుపేట
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు పత్తితోపాటు వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను వేరే ప్రాంతాలకు తరలించేందుకు లారీల కు డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా ఇతర సమయా ల్లో ఇసుక, ఇటుక, గ్రానెట్ తదితర వాటిని తరలిస్తుండడంతో ఎప్పుడూ పని ఉంటున్నది.
ఆంజనేయులు, ఇంద్రారెడ్డి నగర్, శంకర్పల్లి
దుక్కులు దున్నడం, గొర్లు కొట్టేందుకు, నాట్లు వేసేందుకు రైతులకు కూలీలు దొరకడంలేదు. ఈ పరిస్థితుల్లో ఆధునిక పద్ధతుల వైపు రైతు లు మొగ్గుచూపుతున్నారు. సమయం కూడా కలిసొస్తుండడంతో వ్యవసాయంలో ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ఫలితంగా సీజన్లో ట్రాక్టర్లకు గిరాకీ పెరిగింది. వ్యవసాయ పనులతోపాటు ఇటుక, ఇసుక పనులకు ఉపయోగించి ట్రాక్టర్లను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. అలాగే వరికోతల సమయంలోనూ కూలీల కొరతను దృ ష్టిలో ఉంచుకుని చాలామంది రైతులు హార్వెస్టర్ మిషన్లను ఆశ్రయిస్తున్నా రు. వీటికి సైతం డిమాండ్ పెరుగడంతో గతంలో మండలాని కో యంత్రం ఉండగా..ఇప్పుడు గ్రామానికో యంత్రం చొప్పున అం దు బాటులోకి వచ్చాయి. సీజన్లో సాగర్ ఆయకట్టు ప్రాంతానికి సైతం జిల్లా నుంచి హార్వెస్టర్లు వరి కోతల కోసం వెళ్తుండగా..అక్కడి హా ర్వెస్లర్లు సాగర్ ఆయకట్టులో వరి కోతలను ముగించుకుని రంగారెడ్డి జిల్లాకు వస్తున్నాయి. దీంతో అటు ట్రాక్టర్ల యజమానులు, ఇటు హా ర్వెస్టర్ల యజమానులకు ప్రతి సీజన్లోనూ ఫుల్ గిరాకీ ఉంటున్నది.