మొయినాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ సురబీ వాణీదేవి తోలుకట్టా గ్రామానికి విచ్చేసి గ్రామంలో ఉన్న పీవీ నర్సింహారావు మెమోరియల్ ట్రస్ట్ను సందర్శించారు. ఈ సందర్భంగా తోలుకట్టా సర్పంచ్ శ్రీనివాస్ ఆమెను కలిసి గ్రామానికి తీసుకెళ్లారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరించాడు. గ్రామంలో సీసీ రోడ్లు వేయాల్సి ఉందని, దానికి నిధులు కావాలని చెప్పారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక కొన్ని అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని ఎమ్మెల్సీకి వివరించారు. గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వాలని సర్పంచ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీని కోరారు.
నిధులు మంజూరు చేస్తే గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తామని సర్పంచ్ విజ్ఞిప్తి చేశారు. సర్పంచ్ విజ్ఞప్తి చేయగా స్పందించిన ఎమ్మెల్సీ వెంటనే గ్రామానికి రూ. 20లక్షల వరకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ పేర్కొన్నాడు. ముందుగా సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 10లక్షలు, తరువాత 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు. గ్రామానికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చినందుకు ఎమ్మెల్సీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.