కడ్తాల్, అక్టోబర్ 6 : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్స్టేషన్ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. శనివారం హోంమంత్రి మహమూద్అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై పోలీస్స్టేషన్ను ప్రారంభించనున్నారు. 30 గుంటల విస్తీర్ణంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో విశాలమైన గదులున్నాయి.
సీఐ, ఎస్ఐ, రైటర్లు, సిబ్బందికి ప్రత్యేక గదులు, రికార్డుల రూంలు, రిసెప్షన్, కంప్యూటర్, విశ్రాంతి, వెయిటింగ్ గదులు, సువిశాలమైన పార్కింగ్ సౌకర్యం ఉన్నది. ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్వ్రీంద్ర, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ రంగస్వామి హాజరుకానున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.