రంగారెడ్డి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 24 మంది సభ్యులతో నూతన పాలక మండలిని నియమించింది. ఇందులో తెలంగాణకు అవకాశం కల్పించింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డిని పాలక మండలి సభ్యురాలిగా నియమించింది. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో భాగస్వామ్యమై మొక్కలను నాటడం ద్వారా హరిత స్ఫూర్తిని చాటుతున్నారు. వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు.
టీటీడీ హైదరాబాద్ ఎల్ఏసీ సభ్యురాలిగా పనిచేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎఫ్ఐసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వ్యవహరిస్తూ మహిళా సాధికారతతోపాటు విద్య, వైద్యం తదితర అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలను చైతన్యపరుస్తున్నారు.