ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో అష్ట కష్టాలు పడుతున్న జీవితాల్లో ‘పర్మినెంట్’ వెలుగులు నింపారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం రోజునే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో వందలాది మందికి ప్రయోజనం చేకూరనున్నది. రెగ్యులరైజ్ నిర్ణయంపై ఆయా విభాగాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. తమ బతుకులకు కొత్త వెలుగులు అందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వికారాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికతకు అధిక ప్రాధ్యానతనిస్తామని ఇచ్చిన హామీ మేరకు నూతన నియామక విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి, గతంలో 60-80 శాతం ఉన్న స్థానిక రిజర్వేషన్లను 95 శాతానికి పెంచడంతోపాటు ఈ పద్ధతిలోనే కొత్త ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం చేపట్టడం గమనార్హం. అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంతోపాటు సెర్ప్ ఉద్యోగులు, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసి అండగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకిచ్చిన హామీని నిలబెట్టుకుని సబ్బండ వర్గాల ప్రభుత్వంగా పేరొందింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని దాదాపు 150 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ కానున్నారు. జిల్లాలో రెగ్యులరైజ్ కానున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో అత్యధికంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లుండగా, అనంతరం వైద్యారోగ్య శాఖలో ఉన్నారు. జిల్లాలోని 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 75 మంది జూనియర్ లెక్చరర్లను ప్రభుత్వం ప్రభుత్వ లెక్చరర్లుగా క్రమబద్ధీకరించనుంది. అదేవిధంగా వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న 33 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నారు. వైద్యారోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్స్-4, ఫార్మాసిస్ట్లు-8, వైద్య సహాయకులు-21 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ కానున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– అన్వర్, సివిక్స్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెద్దేముల్
సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయడంతో మాకో భరోసా దొరికింది. మేము పర్మినెంట్ అయ్యామన్న సంతోషంతో మా కుటుంబాలు పండుగ చేసుకుంటున్నాయి. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న సర్కారు మా జీవితాల్లో వెలుగులు నింపింది.
ఇచ్చిన మాట నిలుపుకున్న కేసీఆర్ – గుర్రాల వెంకట్రెడ్డి, ప్రభుత్వ ఒకేషనల్ లెక్చరర్, తాండూరు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ మొదటి సంతకం చేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2004 నుంచి విధులు నిర్వహిస్తున్నాను. పందొమ్మిదేండ్లుగా విద్యావ్యవస్థలో పనిచేస్తున్న నేను సీఎం కేసీఆర్ లాంటి మంచి పరిపాలన నాయకుడిని ముందెన్నడూ చూడలేదు.
– జి.ప్రకాశ్గౌడ్, జూనియర్లెక్చరర్, పూడూరు మండలం
కాంట్రాక్టు ఉద్యోగులపై తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నాను. గత కొంత కాలం నుంచి రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రిని కోరుతూ వచ్చాం. మమ్ములను పర్మినెంట్ చేసేలా తొలి సంతకం చేయడంతో మా ఉద్యోగుల్లో సీఎం కేసీఆర్ సంతోషాన్ని నింపారు.
కేసీఆర్ను జీవితంలో మర్చిపోము – మల్లయ్య, కొడంగల్, కాంట్రాక్ట్ తెలుగు అధ్యాపకుడు
23 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. వయస్సు పైపడుతుండటంతో కాంట్రాక్ట్ ఉద్యోగిగానే ఉండిపోవాల్సి వస్తుందనే ఆందోళన ఉండేది. 23 సంవత్సరాలు పడ్డ కష్టం వృథా అవుతుందనే భయపడ్డాను. కొత్త సచివాలయం ప్రారంభంతో కేసీఆర్ ప్రకటనతో కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగు నింపింది.
గత ప్రభుత్వం విద్యావ్యవస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగుల అమలును తీసుకొచ్చి ఇంటర్ విద్యను దిగజార్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ విద్యా విధానంలో ఎన్నో మార్పులు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించడం చాలా సంతోషమైన విషయం. నా 23 సంవత్సరాల కల నెరవేరింది.
– యు.సంగీత, మోమిన్పేట ప్రభుత్వ కళాశాల లెక్చరర్
– శ్రీధర్కుమార్, దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాల, వికారాబాద్
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్పై సంతకం చేసి మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఎంతో చొరవ చూపి రెగ్యులరైజ్ చేసిన సీఎం కేసీఆర్కు వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు రుణపడి ఉంటారు.
– పండరి, అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొడంగల్
కాంట్రాక్టు ఉద్యోగంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనే తరుణంలో కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించడం మా జీవితాల్లో వెలుగు నింపింది. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. మా కష్టాన్ని గుర్తించి మాకు న్యాయం చేయడంతో మరింత బాధ్యతతో పని చేస్తాం.
ఆధునిక సమాజంలో గౌరవ వృత్తికి ఆదరణ తగ్గుతున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ వృత్తికే వన్నె తెచ్చారు. గత ప్రభుత్వాలు నగరంలో కల్లు దుకాణాలను మూసివేయడంతో గౌరవ వృత్తిపై ఆధారపడి ఉన్న కుటుంబాలు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కల్లు గీత కార్మికులను మరింత ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో ఈత వనాలను ఏర్పాటు చేయించారు. నీరా ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం లభిస్తున్నదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నగరంలో నీరా కేఫ్లు ఏర్పాటు చేయడంతో కల్లు గీత కార్మికులు, గౌడ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలకు కూడా ఇలాంటి ఆలోచనలు రాలేదు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు కల్లు గీత కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. కల్లు గీత కార్మికులు తమ వృత్తిలో భాగంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయే కుటుంబాలకు రైతు బీమా తరహాలోనే కల్లు గీత కార్మికులకు బీమా రూ.5 లక్షలు ప్రకటించడం చాలా సంతోషకరం.
– అంజయ్యగౌడ్, నక్కలపల్లి, మొయినాబాద్ మండలం
చరిత్రలో లేని విధంగా సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందినట్లయింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవడం హర్షణీయంగా ఉంది. – పి.ఆశీర్వాదం,
మోమిన్పేట ప్రభుత్వ కళాశాల లెక్చరర్