ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్క యువకుడు స్వశక్తితో ముందుకు సాగాలని టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బుజంగాచారి తన సొంతంగా ఏర్పాటు చేసుకున్న టెక్స్మో వ్యవసాయ బోరుబావులకు సంబంధించిన మోటర్ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ సొంతకాళ్లపై నిలబడి ఉన్నతమైన స్థానాలను అదిరోహించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.