మహేశ్వరం:అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు మృతిచెందిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మహేశ్వరం సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన మారమోని శివకుమార్యాదవ్(32) కూలీపని చేసుకుంటు జీవనం సాగించేవాడు. గురువారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడని అన్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి చనిపోయి ఉన్నాడని తెలిపారు. శివకుమార్ మరణంపై అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.