తాండూరు రూరల్, జనవరి 14 : తాండూరు లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవు తున్నది. పట్టణంతోపాటు సరిహద్దుల్లో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. స్థానిక పోలీసులు నివారణ చర్యలు తీసుకుంటునప్పటికీ ప్రమాదాలు సంభవిస్తూ నే ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పోలీ సులకు పెను సవాలుగా మారింది. వ్యాపార, వాణిజ్య కేంద్రంగా తాండూరు విరాజిల్లుతుం డడంతో నిత్యం దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో వాహనాలు రాకపో కలు సాగిస్తుంటాయి.
తాండూరు ప్రాంతంలో నాపరాయి పరిశ్రమలు, సుద్ద వ్యాపారం తోపాటు చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. తాండూరు మండలంలో సీసీఐ, పెన్నా, ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీల తోపాటు తెలంగాణ సరిహద్దులో వికాట్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ, చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయా ఫ్యాక్టరీలకు ని త్యం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల నుంచి బొగ్గు, యాష్తోపాటు ఇతర సామగ్రి వస్తున్నది.
అంతేకాకుండా ఈ ప్రాంతం నుం చి సిమెంట్ లోడ్తో భారీ ట్యాంకర్లు, లారీలు రాకపోకలు సాగిస్తాయి. వీటికితోడు స్థాని కంగా నాపరాయి, సుద్ద వ్యాపారం కోసం కూ డా పలు రాష్ర్టాల నుంచి భారీగా వాహనాలు వస్తూ, పోతూ ఉంటాయి. ఈ వాహనాలన్నీ తాండూరు పట్టణంలో నుంచి రాకపోకలు సా గిస్తాయి. వీటి కారణంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. పోలీసులు ని వారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక చోట సమస్య తలెత్తుతూనే ఉంది.
ఇటీ వల పట్టణంలోని చిలుక వాగు సమీపంలో ఓ సిమెంట్ లోడ్ లారీ ఏకంగా ఓ దుకాణంలోకి దూసుకెళ్లగా.. బైక్లు దెబ్బతిన్నాయి. అలాగే హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఓ బైక్ను ఓ లారీ ఢీకొట్టింది. స్కూల్ వేళల్లో ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు, సాయం త్రం 4.30 నుంచి 5 గంటల వరకు పట్టణం వెలు పలనే భారీ వాహనాలను ఆపేస్తున్నారు. దీం తో విద్యార్థులకు ఇబ్బందులు తగ్గాయి.
పట్టణంలో శివాజీచౌక్, ఇందిరాచౌక్, బ స్టాండ్ ఏరియాల్లో సిగ్నల్ వ్యవస్థను పున రుద్ధరించాల్సిన అవసరం ఉందనే అభిప్రా యం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ విషయమై మున్సిపల్తోపాటు పోలీసు శా ఖ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పా టు చేసినా మౌలిక సదుపాయాలు కల్పిం చలేదు. రోడ్లపై జీబ్రా క్రాసింగ్ను ఏర్పా టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప ట్టణంలో అక్కడక్కడ నో పార్కింగ్ బోర్డు లు ఏర్పాటు చేశారు.
రోడ్లపై సూచిక బో ర్డులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవస రం ఉంది. ఇందిరా చౌక్ నుంచి రైల్వే స్టేష న్ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఉ దయం, సాయంత్రం జనాలతో కిక్కిరిసిపో తుంది. రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అ ధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని పట్టణవాసులు, ప్రయాణికులు కోరుతున్నారు.