పహాడీషరీఫ్, జూన్ 24 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకుని ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాఉయి. పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీరామకాలనీలో నివాసముంటున్న రాములు కుమారుడు జశ్వంత్(12) శివరాంపల్లిలోని ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
గత రెండు రోజుల క్రితం తన తరగతి విద్యార్థినికి లవ్ లెటర్ ఇవ్వడంతో ఆ విద్యార్థిని టీచర్కు ఫిర్యాదు చేసింది. టీచర్ జశ్వంత్ను మందలిచ్చి తర్వాత రోజు కలవాలని చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన అతను ఇంట్లో ఎవరు లేని సమయంలో.. గురువారం సాయంత్రం 6 గంటలకు ఐరన్రాడ్కు చీరతో ఉరేసుకుని మృతి చెందాడన్నారు. బాలుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.