తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దళితులు, నేతన్నలు, గౌడన్నలు, యాదవ్లు, మత్స్యకారులు ఇలా అన్ని సామాజిక వర్గాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. ఒకసారి చేపల పెంపకాన్ని పరిశీలిస్తే గత తొమ్మిదేండ్లలో రంగారెడ్డి జిల్లాలో రూ.739.26 కోట్ల సంపదను మత్స్యకారుల కుటుంబాలు ఆర్జించాయి. ఏటా ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందిస్తుండడంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 794 చెరువుల్లో చేపల పెంపకం చేపడుతుండగా.. ఏటా టన్నుల కొద్దీ దిగుబడి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏకంగా 9,837 టన్నుల పై చిలుకు దిగుబడి వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత తొమ్మిదేండ్లలో 57,443 టన్నుల దిగుబడి రాగా.. మత్స్యకార కుటుంబాలకు కాసుల పంట పండింది. ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు పంపిణీ చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రంగారెడ్డి, మే 8 (నమస్తే తెలంగాణ) : కుల వృత్తులకు చేయూతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటికి పూర్వ వైభవం తెచ్చేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే చేపల వేటను జీవనాధారంగా మార్చుకున్న గంగపుత్రుల బతుకులను బాగు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కొండంత అండగా నిలుస్తున్నది. వ్యవసాయానికి దండిగా నీళ్లు, సరిపడా కరెంటు సరఫరా చేస్తూ రైతన్నల తలరాత మార్చిన సీఎం కేసీఆర్.. వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తూ గంగపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రా మాల్లో మొత్తం 794 చెరువులున్నాయి. వాటిలో 120 చెరువులు మైనర్ ఇరిగేషన్కు చెందినవి కాగా 674 చెరువులు మత్స్యశాఖ అధీనంలో ఉ న్నాయి. వాటి విస్తీర్ణం 6,422 హెక్టా ర్లు.. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది చెరువుల్లో పూడిక తీయడంతోపాటు వాటి మత్తడుల నిర్మాణాలను పెంచడంతో వర్షాకాలంలో కురిసిన వానలకు ప్రతి చెరువులోనూ జలకళ సంతరించుకున్నది. కాగా జిల్లాలో మత్స్య కార సంఘాలు 152 ఉన్నాయి.
57,443 టన్నుల దిగుబడి
ప్రభుత్వ ప్రోత్సాహంతో దళితులు, నేతన్నలు, గౌడన్నలు, యాదవ్లు, మత్స్యకారులు ఇలా అన్ని సామాజిక వర్గాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాబడిని ఆశించకుండా .. వందశాతం సబ్సిడీతో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు.. వారికి ఉపాధిని కల్పించేందుకు ఒక్కో సొసైటీకి లక్షలాది చేప పిల్లలను అందిస్తున్నది. దీనిద్వారా జిల్లాలోని మత్స్యకార సొసైటీలు, వారి కుటుంబాలు పెద్ద మొత్తం లో లాభాలను ఆర్జిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభు త్వం మత్స్యకారులకు అండగా ఉంటూ ఉచితం గా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. జిల్లా నుంచి ప్రతిఏటా చేపల పెంపకంతో మూడు నుంచి ఐదువేల టన్నులకు పైగా దిగుబడి వస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఇప్పటివరకు (ప్రస్తుత సంవత్సరం) 9,837 టన్నులపై చిలుకు దిగుబడి వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత తొమ్మిదేండ్లలో 57,443 టన్నుల దిగుబడిని సాధించగా.. రూ. 739 కోట్ల 26 లక్షల రాబడిని మత్స్యకారులు ఆర్జించారు.
794 చెరువుల్లో చేపల పెంపకం
బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నది. అందులో భాగంగానే బెస్త, ముదిరాజుల (మత్స్యకారుల) కుటుంబాలు ఆర్థికంగా రాణించాలనే సంకల్పంతో సబ్సిడీపై ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నది. కాగా జిల్లాలోని 794 చెరువుల్లో చేపలను పెంచుతున్నారు. చేప పిల్లలు పెరిగిన తర్వా త వాటి విక్రయాల్లోనూ మత్స్యకారులు నష్టపోకూడదనే ఉద్దేశంతో.. చేపలను జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తూ.. హైదరాబాద్ నగరానికి సైతం ఎగుమతి చేస్తున్నది. ఇతర ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేసేందుకు మత్స్యకారులకు 70% సబ్సిడీతో వాహనాలను సైతం రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే అందజేసింది. జిల్లాలోని ఉన్న వం దలాది చెరువుల్లో ప్రతియేటా చేప పిల్లలను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తున్నది. అంతేకాకుం డా ఆయా సొసైటీల్లో సభ్యత్వం కలిగిన మత్స్యకారుడు ప్రమాద రీత్యా మృతి చెందితే.. ఎక్స్గ్రేషియా కింద రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రమాద రీత్యా మత్స్యకారుడికి శాశ్వత అంగ వైకల్యం కలిగినచో రూ.2,50,000 లక్షలను ప్రభుత్వం చెల్లిస్తున్నది.
దిగుబడితోపాటు రాబడి..
తెలంగాణ ప్రభుత్వం సామాజిక వర్గాలకు చేయూ త ఇస్తున్నది. అందులో ప్రధానంగా మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధిని కాంక్షిస్తూ వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ఉచితంగా అందిస్తున్నది. జిల్లాలో తొలుత పదుల సంఖ్యలో ఉన్న సొసైటీలను 152కు పెంచి బెస్త, ముదిరాజులు, ఇంకా ఇతరత్రా మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడమే కాకుండా రవాణాకూ వాహనాలను అందించాం. జిల్లాలోని మత్స్యకారులు చేపల పెంపకంతో మంచి దిగుబడితోపాటు రాబడినీ ఆర్జిస్తున్నాం.
-సుకీర్తి, సహాయ సంచాలకురాలు, మత్స్య శాఖ, రంగారెడ్డి జిల్లా
చేపలకు గిరాకీ ఉన్నది
చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాం. చెరువుల్లో పెరిగిన చేపలను పట్టి చుట్టూ ఉన్న గ్రామా ల్లో విక్రయించి మంచి ఆదాయాన్ని పొందుతు న్నాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్నేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగడంతో చేపల పెంపకానికి అనుకూలంగా మారింది. చెరువుల్లో పెంచిన చేపలకు మంచి గిరాకీ ఉన్నది.
– అల్లె బాలరాజ్, మత్స్యకారుడు, కొత్తపేట, కేశంపేట
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహిస్తున్నది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నది. అవి పెరిగిన తర్వాత వాటిని పట్టుకుని మా చుట్టూ ఉన్న గ్రామాల్లో విక్రయించి జీవిస్తున్నాం. చేపలను విక్రయించేందుకు మండల కేంద్రాల్లో మా ర్కెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– ప్రవీణ్, మత్స్యకారుడు, కేశంపేట