తెలంగాణ ప్రభుత్వం కొలువుల మేళా కొనసాగిస్తున్నది. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. వరుసగా నోటిఫికేషన్ల విడుదలతో నిరుద్యోగ యువతలో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. పుస్తకాలతో కుస్తీ పడడంతో పాటు కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, ఉన్నత విద్య తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 9 మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,392 జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ కొత్తగా 7,029 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. వరుస ప్రకటనలు చేస్తుండడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నది.
బొంరాస్పేట, డిసెంబర్ 11: రాష్ట్రంలో ప్రస్తుతం కొలువుల మేళా కొనసాగుతున్నది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా.. మరి కొన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. మరోవైపు వరుసగా నోటిఫికేష న్లు జారీ అవుతుండటంతో నిరుద్యోగుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే ఉద్దేశంతో ఉద్యోగార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కోచింగ్ సెంటర్లకెళ్లి శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వం యువతకు కొత్త ఏడాది కానుకగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది.
ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సీఎం..
లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి ఇప్పటికే టీఎస్పీఎస్సీ, పోలీసు నియామ క బోర్డు, వివిధ శాఖలు నోటిఫికేషన్లు జారీ చేశా యి. సుమారు 20 వేలకుపైగా కానిస్టేబుళ్లు, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ జారీ చేయగా అధికారులు ప్రిమిలినరీ పరీక్షను కూ డా నిర్వహించి మెయిన్ పరీక్షకు అర్హులను ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, ఉన్నత విద్య తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవలే నోటిఫికేషన్ను జారీ చేయగా..
ఈ పరీక్షను వచ్చే ఏడాది మేలో నిర్వహించే అవకాశం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలోని తొమ్మిది మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,392 జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొత్తగా 7,029 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. బీసీ గురుకులాలు, సైబర్ సేఫ్టీ, ఆర్ అండ్ బీలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
యువత సద్వినియోగం చేసుకోవాలి
సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. ఈ ఏడాది నాలుగు వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేయడం నిరుద్యోగులకు శుభ పరిణామం. తెలంగాణ ప్రభు త్వం నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించింది. దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి -హన్మంతు, యాలాల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూ స్ చెప్పింది. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకా రం నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. ఇప్పటికే ఉద్యోగార్థుల సౌకర్యార్థం నియోజకవర్గ కేంద్రా ల్లో ఉచితంగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా గ్రూప్-1,2,3,4 తదితర అంశాల్లో క్షోచింగ్ ఇవ్వడం జరిగింది.
-రజితారామచందర్, గ్రూప్స్ అభ్యర్థిని, కోకట్, యాలాల మండలం
గ్రూప్-4 పరీక్షకు సిద్ధమవుతున్నా..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. నేను గ్రూప్-4 పరీక్ష కోసం సిద్ధమవుతున్నా. ఈ సారి కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు శ్రమిస్తున్నా.
– మంజుల, తాండూరు
నిరుద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పక్షపాతి అని మరోసారి రుజువైంది. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామనే మాటను ప్రభు త్వం నిలబెట్టుకుంటున్నది. వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఈసారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తా.
-సగ్గం శివరాజ్, గ్రూప్స్ అభ్యర్థి, గ్రామం అంతారం, తాండూరు మండలం
ఇంటి వద్దే సన్నద్ధమవుతున్నా..
తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో నిరుద్యోగుల్లో పోటీతత్వం పెరిగింది. బీటెక్ చదివిన తాను ప్ర భుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే సంకల్పంతో హైదరాబాద్లో ని ఆర్సీరెడ్డి కోచింగ్లో శిక్షణ తీసుకొని.. ప్రస్తుతం ఇంటి వద్దే సన్నద్ధమవుతున్నా.
– శ్రీకాంత్, పరిగి టౌన్
ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా..
2017లో కోచింగ్ తీసుకొని డీఎస్సీ పరీక్ష రాశా. రెండు మార్కులు తక్కువగా రావడంతో జాబ్ రాలేదు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉండి డీఎస్సీ, జూనియర్ లెక్షరర్స్, గురుకులాలకు సన్నద్ధమవుతున్నా. ఈసారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే కసితో తీవ్రంగా శ్రమిస్తున్నా.
-శంకర్, డీఎస్సీ అభ్యర్థి, వికారాబాద్
గురుకులాలకుప్రిపేర్ అవుతున్నా..
ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రభు త్వం తీపి కబురును అందించింది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉండి జూనియర్ లెక్షరర్స్, గురుకులాలకు సన్నద్ధమవుతున్నా.
-కోస్గి వెంకట్, మందిపల్ చౌడాపూర్ మండలం
గ్రంథాలయానికి వెళ్లి చదువుకుంటున్నా
కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించేందుకు వికారాబాద్ జిల్లా గ్రంథాయంలో ఉన్న అవసరమైన మెటీరియల్ను తీసుకుని చదువుకుంటున్నా. గతంలో అవసరమైన శిక్షణను కూడా పొందాను. ప్రతిరోజూ ఉదయం వేళలో ఈవెంట్స్కు మైదానానికి వెళ్లి వచ్చి.. ఆ తర్వాత గ్రంథాలయానికెళ్లి అవసరమైన పుస్తకాలను చదువుకుంటున్నా.
-రాధిక, కానిస్టేబుల్ అభ్యర్థిని,మైలారం కొత్తతండా, ధారూరు
ఈసారి పోటీ తీవ్రంగా ఉన్నది
ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఈ సారి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నా నేపథ్యంలో ప్రతిరోజూ తీవ్రంగా సన్నద్ధమవుతున్నా. అవసరమైన పుస్తకాలను మార్కెట్లో కొనుగో లు చేసి ప్రతిరోజూ చదువుతున్నా. గతంలో కాంట్రాక్టు ఉద్యోగం చేయగా.. అక్కడ తొలగించడంతో రోడ్డున పడాల్సి వచ్చింది.
-ఎరుకలి రమేశ్, ఎంఎస్సీ, బీఈడీ, హస్నాబాద్, కొడంగల్
ప్రభుత్వ ఉద్యోగంతో పూర్తి భద్రత
ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే పూర్తి భద్రత ఉంటుంది. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. కొంతకాలంగా ప్రభు త్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో ఈ సారి పోటీ అధికంగా ఉంటుంది. అందుకోసం ప్రతిరోజూ సీరియస్గా సన్నద్ధమవుతున్నా.
– అనంతయ్య, ఎంఏ, బీఈడీ, చంద్రకల్, దౌల్తాబాద్ మండలం. కొడంగల్