వికారాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్న ది. 42 బృందాల్లోని వైద్యులు నేత్ర సంబంధిత సమస్యలతో వచ్చిన మహిళలు, వృ ద్ధులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గురువారానికి పదోరోజుకు చేరుకోగా..6,429 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 1,002 మందికి రీడింగ్ గ్లాసెస్ను వైద్యులు పంపిణీ చేశారు. 678 మంది కోసం ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డర్ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో 16,970 మందికి కంటి పరీక్షలు
షాబాద్, ఫిబ్రవరి 2: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరం లా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు మహిళలు, వృద్ధులు అధికంగా తరలివస్తున్నారు. శిబిరాలకు వచ్చిన వారికి వైద్యులు కంటి పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి అద్దాలు, మందులను పంపి ణీ చేస్తున్నారు. గురువారానికి ఈ కార్యక్రమం పదోరోజుకు చేరుకున్నది. గురువారం రం గారెడ్డి జిల్లాలోని 80 ప్రత్యేక బృందా లు 16,970 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 2,935 మందికి అద్దాలను పంపిణీ చేశారు. 2,529 మందికి ప్రి స్క్రిప్షన్ అద్దాలకోసం వైద్యులు ఆర్డర్ ఇచ్చా రు. జిల్లాలో కొనసాగుతున్న క్యాంపులను డీఎంహెచ్వోపాటు డివిజన్స్థాయి వైద్యాధికారులు సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు. జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీం పట్నం,ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని శిబిరాల్లో వైద్యు లు గురువారం 16,970 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
మందులు, అద్దాలు ఇస్తున్నారు
కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంలాంటిది. గ్రామాలకే వైద్యులు వచ్చి ఉచితంగా పరీక్షలు చేసి అద్దా లు, మందులను పంపిణీ చేస్తున్నారు. ఇదివరకు పరీక్షలు చేయించుకోవాలంటే పట్టణాలకు వెళ్లా ల్సి వచ్చేది. ఇప్పుడు ఆ తిప్పలు తొలగిపోయాయి. మా గ్రామంలో ఏర్పా టు చేసిన క్యాంపులో పరీక్షించిన వైద్యులు నాకు అద్దాలు ఇచ్చారు.
-మంగలి శ్రీశైలం, కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల మండలం
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు..
మా తండాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో వైద్యులు నాకు దృష్టి లోపం ఉందని గుర్తించి కంటి అద్దాలు ఇచ్చారు. అవి పెట్టుకుంటే కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమం పేదలకు వరంలా మారింది.
-గోప్యానాయక్, పాతకొడంగల్తండా, కొడంగల్
సీఎం కేసీఆర్ పేదోళ్లకు మంచి చేస్తుండు..
సీఎం కేసీఆర్ పేదలకు మంచి చేస్తున్నారు. గతంలోని ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదు. ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయలేదు. ఉచితంగా కంటి పరీక్షలు చేసి..అద్దాలు, మందులను ఇవ్వడం హర్షణీయం. నేను కూడా కంటి పరీక్షలు చేయించుకోగా పరీక్షించిన వైద్యులు దృష్టి లోపం ఉందని చెప్పి అద్దాలు ఇచ్చారు.
-కుర్వ సత్యనారాయణ, పెద్దమంగళారం, మొయినాబాద్
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
ఆరోగ్య తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మన పథకాలు దేశానికే దిక్సూచి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఇంటా ఆనందాల వెలుగు నింపుతున్నది. పేదలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కార్పొరేటు స్థాయి వైద్యం అందుతున్నది. గ్రామాల్లో ఏర్పాటైన శిబిరాల్లోని వైద్యులు అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు.
-లక్ష్మీదేవి, రాఘవాపూర్ సర్పంచ్, యాలాల మండలం
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదే లక్ష్యంగా..
నిరుపేదల బంధువు సీఎం కేసీఆర్. వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నది. కంటి వెలుగు శిబిరాల్లోని డాక్టర్లు పేదలకు చక్కని వైద్యం అందిస్తున్నారు. అవస రమైన వారికి కంటి అద్దాలతోపాటు మందులను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -మధుసూదన్రెడ్డి, అచ్యుతాపూర్ సర్పంచ్, యాలాల మండలం.
పేదలకు వరం..
కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం. మాలాంటి పేదలు ప్రైవేట్ దవాఖానకు వెళ్లి చూపించుకోలేరు. వారందరికీ ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. కంటి శిబిరాల్లో వైద్యులు మంచిగా చూస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు, మందులను సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది. రానున్న ఎన్నికల్లో ఆయనకే మళ్లీ ఓటు వేస్తా.
– సుక్కమ్మ, శంకర్పల్లి
కండ్లు బాగా కనిపిస్తున్నాయి..
కండ్లు మసకబారి దూరం చూపు కనిపించక చాలా తిప్పలు పడ్డా. మా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో పరీక్షించిన వైద్యులు నాకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించి కొత్త అద్దాలు ఇచ్చారు. అవి పెట్టుకోగానే కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. మాలాంటి పేదలకు కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలి.
-గొంగుపల్లి తిర్మలయ్య, చిట్యాల్, పరిగి టౌన్