రంగారెడ్డి, మే 19 (నమస్తే తెలంగాణ): గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు. సామాన్యుల ఇక్కట్లు, అవస్థలను అర్థం చేసుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సం క్షేమమే ధ్యేయంగా పాలన సాగుతున్నది. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అం దుతున్నాయి. ప్రజలు కంటి చూపు సమస్యలతో ఇబ్బందులు పడొద్దని..మసకబారుతున్న కండ్లకు చికిత్స అందేలా, కంటి చూపులో లోపం సరిదిద్దుకునేలా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే అంధకారంలో కూరుకుపోయి న ఎంతోమంది జీవితాల్లో వెలుగులు ప్రసరించే లా ప్రభుత్వం కృషి చేస్తున్నది. 18 ఏండ్లు నిండి న ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యులు మందులతోపాటు కంటి అద్దాలను వైద్యులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మొదటి విడుతను విజయవంతంగా పూర్తి చేయగా.. రెండో విడుత కార్యక్రమాన్ని ప్రభుత్వం జనవరి 18న ప్రారంభించగా.. జిల్లాలో నిరాటంకంగా సాగుతున్నది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగించేందుకు వైద్యాఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీ గా ఏర్పాట్లు చేశారు.
కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలకు సేవలందించేందుకు 80 ప్రత్యేక వైద్య బృందాలు పని చేస్తున్నాయి. ప్రతి బృందంలో మెడికల్ ఆఫీసర్, ఆఫ్తమాలజిస్ట్, సూపర్వైజర్, డీఈవో, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు/ ముగ్గురు ఆశ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఒక్కో బృందం లో 8నుంచి 9 మంది చొప్పున సిబ్బంది కొనసాగుతున్నారు. కాగా రంగారెడ్డి జిల్లాలో మొత్తం 640 నుంచి 720 మంది వైద్యారోగ్య నిపుణులు పనిచేస్తున్నారు. వీరంతా కంటి వెలుగు కార్యక్రమం ద్వారా క్యాంపులు నిర్వహించి కంటి వ్యా ధులున్న వారికి అవసరమైన పరీక్షలతోపాటు మందులు, కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో జనవరి 19న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బాలాపూర్ పరిధిలోని మీర్పేట ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నిరాటంకం గా కొనసాగుతున్నది. ఇప్పటివరకు నాలుగు నెల లు పూర్తైంది. అందులో ఇప్పటివరకు 75 రోజు ల క్యాంపు దినాలు విజయవంతంగా పూర్తయ్యా యి. 75 రోజుల్లో 407 గ్రామ పంచాయతీల్లో శిబిరాలను నిర్వహించారు. ఇంకా 31 గ్రామ పంచాయతీల్లో వైద్యారోగ్య సేవలు కొనసాగుతున్నాయి. జనవరి 18న రెండో విడుత కంటి వెలు గు కార్యక్రమం ప్రారంభం కాగా..సెలవు దినా లు, పండుగలు పోను మే 17(బుధవారం)తేదీ వరకు మొత్తం 75 రోజులైంది. మే 17న జిల్లా లో ఏర్పాటు చేసిన వైద్యబృందాలు 7,332 మం దికి కంటి పరీక్షలు నిర్వహించాయి. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 6,49,123 మందికి స్క్రీనింగ్ చేసి 90,214 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశా రు. ఇంకా 4,720 మందికి అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంది. 79,938 ప్రిస్క్రిప్షన్ అద్దాలు కావాలని ఆర్డరిచ్చారు. చికిత్సలు అవసరమైన వారిని దవాఖానలకు రిఫర్ చేశారు.
రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ పరిష్కారం చూ పాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే ఆయన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి అంధత్వ నివారణతోపాటు ప్రతి ఒక్కరికీ చూపును ఇవ్వాలన్న ఉద్దేశంతో ముం దుకు సాగుతున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ కంటి వెలుగు క్యాంపులను ఏర్పాటు చేసి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– వెంకటేశ్వరరావు, డీఎంహెచ్వో, రంగారెడ్డి జిల్లా