మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో కొనసాగుతున్న కట్టమైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. అమ్మవారి ఆలయం వరకు మహిళల బోనాల ఊరేగింపు నేత్రపర్వంగా సాగగా, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. చల్లంగ చూడు తల్లీ అంటూ అమ్మవారిని వేడుకున్నారు.
మొయినాబాద్, ఫిబ్రవరి 24 : కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాలు నాలుగు రోజుల నుంచి వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, బోనాల సమర్పణతో శుక్రవారం ఉత్సవాలు ముగిసాయి. ఉత్సవాలను పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు. మండలంలోని సురంగల్లో కట్టమైసమ్మ అమ్మవారి ఆలయాన్ని పునర్నించారు. నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఈనెల 21నుంచి 24వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తులు బోనాలను సమర్పించారు. బోనాల ఊరేగింపు డప్పుల ద రువులు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య కొనసాగింది. అనంతరం అమ్మవారికి బోనంలోని నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవంలో రాజకీయ ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి.మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆదాయ పన్నుల శాఖ మాజీ అధికారి రాములు, గ్రామ సర్పం చ్ గడ్డం లావణ్యాఅంజిరెడ్డి, ఉపసర్పంచ్ యాదమ్మ, మాజీ సర్పంచ్లు భద్రప్ప, ఎర్రోళ్ల చంద్రయ్య, అవుసుల లావణ్యాభాస్కరాచారి, మేకల రాచంద్రయ్య, మాజీ ఉపసర్పంచ్లు గడ్డం అంజిరెడ్డి, వై.జైపాల్రెడ్డి, నాయకులు కంజర్ల ప్రకాశ్, కే,నర్సింహారెడ్డి, గడ్డం వెంకట్రెడ్డి, భాస్కరాచారి, జగన్మోహన్రెడ్డి, ఈగ రవీందర్రెడ్డి, సీతారాంరెడ్డి, ఎన్.మహేందర్రెడ్డి ఎం.మధుసూదన్రెడ్డి, గున్నాల గోపాల్రెడ్డి, ప్రభుయాదవ్, షాబాద్ దర్శన్, మాణెయ్య, రవియాదవ్, ఆలయ కమిటీ సభ్యులు జి.నర్సింహారెడ్డి, కందికొండ మల్లేశ్గౌడ్, కే.యాదగిరియాదవ్, బీ.రాజు, గౌతంరెడ్డి, యాదగిరిచారి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.