పెద్దఅంబర్పేట, నవంబర్ 9: బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి నామినేషన్ సందర్భంగా మున్సిపాలిటీ నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తట్టిఅన్నారం, మర్రిపల్లి నుంచి పార్టీ సీనియర్ నాయకులు అనంతుల వెంకటేశ్వర్రెడ్డి, దేవిడి విజయ్భాస్కర్రెడ్డి, పాశం దామోదర్ రావుల గోపాల్గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కుంట్లూరు నుంచి నాయకులు కళ్లెం ప్రభాకర్రెడ్డి, ఈదమ్మల బలరాం, జోర్క రాము, కౌన్సిలర్ హరిశంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లారు. పెద్దఅంబర్పేట, పసుమాముల నుంచి సైతం స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు భారీగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే నామినేషన్ సందర్భంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మంచిరెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున తరలివెళ్లారు. నామినేషన్ సందర్భంగా ఇబ్రహీంపట్నం ప్రాంతం జనసంద్రంగా మారింది. మండలంలోని 14గ్రామాల నుంచి ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు ఆధ్వర్యంలో భారీ జనసమీకరణ చేపట్టారు.
ఆదిబట్ల : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్, మంగల్పల్లి, ఎంపీ పటేల్గూడ, ఆదిబట్ల, బొగుళూరు, రాందాస్పల్లి, చింతపల్లిగూడ గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధికంగా తరలి వెళ్లారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య, కార్యదర్శి పొట్టి శ్రీకాంత్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోరే కళమ్మ, కోఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్గౌడ్ పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి నామినేషన్ సందర్భంగా మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని లష్కర్గూడ, గండిచెరువు, అనాజ్పూర్, గుంతపల్లి, మజీద్పూర్, జాఫర్గూడ, బాటసింగారం, పిగ్లీపూర్, ఇనాంగూడ, కవాడిపల్లి, బిలిజగూడ, తారామతిపేట, బాచారం, బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో డీజేసౌండ్లు, తెలంగాణ పాటలతో ర్యాలీ నిర్వహించి పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, ప్రధాన కార్యదర్శి కోట వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షులు కోట లక్ష్మారెడ్డి, నారోజు రాజారాంచారి, సర్పంచ్లు చెరుకు కిరణ్కుమార్గౌడ్, ఏసూరి పారిజాత, కావలి రంగయ్యముదిరాజ్, ఎర్రవెల్లి లతాశ్రీ, కోట రాధ, కొర్ర లావణ్య, దూసరి సుజాత, సురకంటి వనజ, ఎంపీటీసీలు సీక సాయికుమార్గౌడ్, రాచపాక లావణ్య, దంతూరి అనిత, నాయకులు మొగుళ్ల జీవన్రెడ్డి, ఏసూరి శేఖర్, ఎర్రవెల్లి గౌరీశంకర్, కొర్ర రాధాకృష్ణయాదవ్, దూసరి యాదయ్యగౌడ్, సురకంటి శ్రీనివాస్రెడ్డి, దంతూరి మహేందర్గౌడ్, రాచపాక యాదగిరి, బొడిగె రమేశ్గౌడ్, శ్రీనివాస్గౌడ్, చెరుకు వెంకటేశ్గౌడ్, గుండె రవీందర్, బి శ్రీను, కొలన్ శేఖర్రెడ్డి, అబ్బవతి బసవయ్య, సుర్వి రాజుగౌడ్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
మంచాల : మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఇబ్రహీంపట్నం తరలివెళ్ల్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవటం కోసం తాము సైనికుల్లా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, బీఆర్ఎస్ నాయకులు చీరాల రమేశశ్, బహదూర్, పుల్లారెడ్డి, కిషన్రెడ్డి, మొగిలి వెంకటేశ్, రాంరెడ్డి, చంద్రకాంత్, సతీశ్, మల్లప్ప, జానీపాషా, మహేందర్, వెంకటేశ్, జంగారెడ్డి తదితరులున్నారు.