అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్ను కలిసినవారిలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తోపాటు ఎంపీ రంజిత్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తిక్రెడ్డి ఉన్నారు.