ఇబ్రహీంపట్నంరూరల్ : గాంధీగ్లోబల్, గాంధీ ప్రతిష్టాన్ సంస్థ సేవలు అభినందనీయమని రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గాంధీగ్లోబల్ ఫ్యామిలీకి సంబంధించి నూతన సంవత్సరం 2022డైరీని గురువారం ప్రగతి భవన్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీగ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తరించాలని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, గాంధీగ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి, సెక్రటరీ యానాల ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాశ్ తదితరులు ఉన్నారు.