కేశంపేట/రంగారెడ్డి : జిల్లాలోని కేశంపేట మండలం దేవునిగుడి తండా పంచాయతీలో వాటర్మెన్గా పనిచేస్తున్న రాత్లావత్ గోపాల్ (53) అనే వ్యక్తి నీటి గుంతలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గోపాల్ తన విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయం వాటర్ట్యాంకు వద్ద నీటి గుంతలో వాల్వ్ బంధు చేయడానికి ఒంగి ప్రమాదవశాత్తు అదే గుంతలో పడి ఊపిరి ఆడక చనిపోయాడు.
తన పుట్టింటి వద్ద ఉన్న గోపాల్ భార్య అంజమ్మకు భర్త చనిపోయిన విషయాన్ని గ్రామస్తులు తెలిపారు. తన భర్త మరణంపై విచారణ నిర్వహించి చర్య తీసుకోవాలని అంజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.