న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ మే 5 : జీవాల పెంపకం చేపట్టేవారు వాటిని ఒకేచోట మేపడం వీలుకాదు. మేత కోసం మందలను ఇతర ప్రాంతాలకు తోలుక పోతుంటారు. సాధారణంగా ఎండాకాలంలో మేత దొరకక ప్రతిరోజు జీవాలను మేపుతూ వాటితో పాటు వందల కిలోమీటర్ల కొద్ది వలసలు వెళ్తుంటారు పెంపకందారులు. ఇలా వెళ్లేప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా జీవాలకు ఏ విధమైన హానీ కలుగకుండా అనుకున్న చోటికి చేరడమే కాకుండా ఆరోగ్యంగా పెరిగి వాటి ద్వారా లాభాలను గడించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జీవాలు వలస వెళ్లేప్పుడు ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
జీవాలను మేత కోసం ఒక చోటు నుంచి మరొక చోటుకు తోలుకుని వెళ్లేప్పుడు తప్పనిసరిగా ప్రత్యేకంగా పరిశీలించాలి. ప్రథమ చికిత్స మందులను తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు వైద్యాదికారిని సంప్రదించి తగిన చికిత్సలు చేయించుకోవాలి. అనారోగ్యంగా ఉన్న జీవాలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతూ మేతను ప్రత్యేకంగా వేయాలి. అలా చేస్తేనే జీవాల పెంపకందారులు ఆశించిన లాభాలను పొందగలుగుతారు.
– సీహెచ్.నాగేంద్ర, మండల పశు వైద్యాధికారి, గరిడేపల్లి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు