కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన రాంచంద్రయ్యకి రూ. 48 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆదివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారుడికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ స్థానిక నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు జగన్రెడ్డి, బాబా, పంతూనాయక్, లక్ష్మయ్య పాల్గొన్నారు.