సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ మిన్హాజుద్ధీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహ్మద్ అబ్దుల్ ముక్తధర్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, వనం సంగీతాయాదవ్, పండల సతీశ్బాబు, ఈఎస్ రాజ్, జితేంద్రనాథ్, టి.మహేశ్వరి తదితరులు పాల్గొని పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.
శేరిలింగంపల్లి మండలం నలగండ్లలో సర్వే నం 442, 443, 444 లోని హుడా లే అవుట్లో 40 ఫీట్ల రోడ్డు.
ఖైరతాబాద్ జోన్లో రూ.41 కోట్లతో 14 థీమ్ పార్కులను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. అందులో మూడు ప్రదేశాల్లో పార్కుల ఏర్పాటుకు అనుకూలంగా లేనందున ఇతర స్థలాలను గుర్తించి అక్కడ థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు.
మన్సూరాబాద్లో సహారా కాంపౌండ్ వాల్ కల్వర్టు నుంచి జీఎస్ఐ రోడ్డు కల్వర్టు 2 బీహెచ్కే అపార్ట్మెంట్ దగ్గర రూ.6 కోట్ల అంచనా వ్యయంతో స్మార్ట్ వాటర్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తారు.
ఫలక్నుమా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రూ. 5.95 కోట్లతో పెవిలియన్, ఇండోర్ స్పోర్ట్స్ భవన నిర్మాణం.
జీడిమెట్ల బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన దండముడి ఎన్క్లేవ్లో అంతర్గత రోడ్డు విస్తరణ పనులు
గాజుల రామారంలో చింతల్ చెరువు డ్రైనేజీ మళ్లింపునకు రూ.2.23కోట్లతో టెండర్లు
గాజుల రామారం మద్దెల కుంట చెరువు రూ.2.15 కోట్ల డ్రైనేజీ మళ్లింపు పనులకు షార్ట్ టెండర్
కుత్బుల్లాపూర్ లాల్సాబ్గూడ, రామన్న చెరువు డ్రైనేజీ మళ్లింపునకు రూ.2.77కోట్ల పనులకు షార్ట్ టెండర్ పిలిచేందుకు అనుమతి
గాజుల రామారం బండ చెరువు డ్రైనేజీ మళ్లింపునకు రూ.2.36 కోట్ల పనులకు షార్ట్ టెండర్
గచ్చిబౌలిలో పికాక్ లేక్ మురుగు మళ్లింపు పనులకు రూ.2.96కోట్లతో టెండర్లు పిలుపు
ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్ ఫిబ్రవరి మాసం రసీదులు, ఖర్చుల వివరాలు సమర్పించిన నివేదికలకు ఆమోదం తెలిపారు.
అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్లో ఎల్బీనగర్ జోన్కు 14, కూకట్పల్లికి 3,
ఖైరతాబాద్ జోన్కు 2 అవార్డులు అధికారులను అభినందించిన మేయర్
సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్ మొదటి అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ -2023లో జీహెచ్ఎంసీకి 19 అవార్డులు వరించాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ అవార్డులు వచ్చేందుకు అధికారులకు సహకరించిన ప్రజలకు మేయర్ అభినందనలు తెలిపారు. కాగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫెస్టివల్ను ఈ నెల 15న నాంపల్లి పబ్లిక్గార్డెన్లో నిర్వహించగా.. జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ గార్డెన్ నిర్వహణలో ఎల్బీనగర్ జోన్కు 14, కూకట్పల్లి జోన్కు 3, ఖైరతాబాద్ జోన్కి రెండు అవార్డులు లభించాయని తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత మేనేజర్లకు మొదటి బహుమతి గోల్డెన్ గార్డెన్ అవార్డు, ద్వితీయ బహుమతి సిల్వర్ గార్డెన్ అవార్డులను మేయర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అదనపు కమిషనర్ కృష్ణ, ఖైరతాబాద్ జోన్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, ఎల్బీనగర్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.