కడ్తాల్, డిసెంబర్ 5 : విద్యార్థులు క్రీడల్లో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని జాతీయస్థాయిలో చాటాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం కడ్తాల్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 12వ జూనియర్ జాతీయస్థాయి లంగిడి క్రీడల ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జైపాల్యాదవ్ లంగిడి క్రీడల రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్తో కలిసి వివిధ జిల్లాలను నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించడానికి గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిందన్నారు. లంగిడి పోటీల్లో తెలంగాణ నుంచి ఎంపికైన విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలకు, రాష్ర్టానికి మంచి పేరు తేవాలని పేర్కొన్నారు.
చంద్రమోహన్ మాట్లాడుతూ.. పాఠశాలలో నిర్వహిస్తున్న లంగిడి 12వ జూనియర్ జాతీయస్థాయి పోటీల్లో రంగారెడ్డి, వరంగల్లు, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు 15 మంది చొప్పున బాలబాలికలను ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 9 నుంచి 12 వరకు మహారాష్ట్రలోని చింబోనిలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేస్తామని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి ప్రకటించారు.
నేల తల్లిని కాపాడుకోవాలి
నేల తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కడ్తాల్లోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రైతులు పంటల సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించాలని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంటలు సాగు చేయాలో అన్నదాతలకు సూచించాలన్నారు. రైతులు పొలాల్లో ఒండ్రు మట్టిని చల్లుకోవాలని, భూగర్భ జలాలు పెంచుకునేందుకు, భూమి కోతకు గురి కాకుండా చెక్డ్యాంలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
అనంతరం మండల కేంద్రానికి చెందిన చెన్న జంగయ్యకు రూ.24 వేలు, మైసిగండి గ్రామానికి చెందిన సునీతకు రూ.28 వేలు, మక్తమాదారం గ్రామానికి చెందిన సంతోషకు రూ.40 వేలు, గోవిందాయిపల్లికి చెందిన మంజులకు రూ.16 వేలు, తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన పర్వత్రెడ్డికి రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. తరువాత మండల కేంద్రంలోని శివాలయంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడి పూజలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు.
కార్యక్రమంలో టీఎస్టీఎస్ జగన్మోహన్రావు, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండల, గ్రామాధ్యక్షులు వీరయ్య, నర్సింహ, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు చందోజీ, తులసీరాంనాయక్, లచ్చిరాంనాయక్, భారతమ్మ, మంజుల, ప్రియ, సులోచన, వినోద్, సేవ్యాబావోజీ, ఇర్షాద్, వెంకటేశ్, హెచ్ఎం జంగయ్య, అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు.