పింఛన్ పెంపుపై ఉమ్మడి జిల్లాలోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. పింఛన్ను రూ.4,116కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే నెల నుంచే పెరిగిన పింఛన్ను అందజేయనుండడంతో దివ్యాంగులు సంబురాలు చేసుకుంటున్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచి వేడుకలు చేసుకున్నారు. గ్రామ గ్రామాన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో 27,707 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది. అలాగే వికారాబాద్ జిల్లాలో 12,806 మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుండగా.. ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.1.42 కోట్ల అదనపు భారం పడనున్నది. ప్రస్తుతం జిల్లాలో ప్రతినెలా రూ.3.90 కోట్లను ఖర్చు చేస్తుండగా, వచ్చే మాసం నుంచి రూ.5.32 కోట్లు వెచ్చించనున్నది. అడగకముందే పింఛన్ను పెంచి తమను మరింత ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికేలా చేసిన సీఎం కేసీఆర్కు వేయి శుభములు కలుగాలని దివ్యాంగులు నిండు మనసుతో ఆశీర్వదించారు.
వికారాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): అప్పట్లో ఏ దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకునే వారు. కానీ నేడు ఏ దిక్కులేని వారికి సీఎం కేసీఆరే పెద్ద దిక్కుగా నిలిచారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పింఛన్ డబ్బులను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా దివ్యాంగుల పింఛన్ డబ్బులను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో దివ్యాంగుల పింఛన్ డబ్బులను రూ. వెయ్యి పెంచి.. వచ్చే నెల నుంచే రూ.4,116 ఇస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని 12,806 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది. ప్రస్తుతం దివ్యాంగులకు ప్రతినెలా రూ.3,016 పింఛన్గా అందుతుండగా.. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.3.90 కోట్లను ఖర్చు చేస్తున్నది. పెరిగిన పింఛన్ డబ్బులతో కలిపి ప్రతినెలా రూ.5.32 కోట్లను ఖ ర్చు చేయనున్నది. మరోవైపు దివ్యాంగుల పింఛన్ డబ్బులను రూ.వెయ్యి పెంచడంపై జిల్లాలోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తమకు మంచి రోజులొచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రూ.200 పిం ఛన్ను రూ.1,000, దివ్యాంగుల పింఛన్ను రూ. 500 నుంచి రూ.1,500 పెంచింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 1,000ల పింఛన్ ను రూ.2,0 16, దివ్యా ంగుల పింఛన్ను రూ. 1,500-రూ.3,016 పెంచింది. అదేవిధంగా ఆస రా పింఛన్ల పెంపుతోపాటు పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు కూడా సీఎం కేసీఆర్ దక్కించారు. అయితే పింఛన్ల నిమిత్తం గత ప్రభుత్వాలు నెలకు రూ.2 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.26 కోట్ల మేర ఖర్చు చేస్తుండగా, వచ్చేనెల నుంచి రూ.2 కోట్ల మేర పెరుగనున్నది. జిల్లాలో ఆసరా పింఛన్దారులు 1,10,983 మం ది, వృద్ధాప్య పింఛన్దారులు-42,384, వితంతువులు-50,508, దివ్యాంగులు-12,806, చేనేత కార్మికులు-147, కల్లుగీతకార్మికులు-432, బీడీ కార్మికులు-39, ఒంటరి మహిళలు 4667 మంది ఉన్నారు.
షాద్నగర్ టౌన్, జూన్ 10 : దివ్యాంగుల సంక్షేమమే సర్కారు ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్ను రూ. 4,116 పెంచడాన్ని హర్షిస్తూ శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే దివ్యాంగులకు అత్యధిక పింఛన్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడా రు. దివ్యాంగుల అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పింఛన్ డబ్బులను రూ.3016 నుంచి రూ. 4116కు పెంచడాన్ని హర్షిస్తూ దివ్యాంగులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, నాయకులు శంకర్, యుగేందర్, నర్సింహులు, దామోదర్, శ్రావణ్, శేఖర్, యాదగిరి, రమేశ్ పాల్గొన్నారు.
దోమ, జూన్ 10: సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ను వచ్చే నెల నుంచి మరో రూ.వెయ్యి పెంచుతామని ప్రకటించడాన్ని హర్షిస్తూ శనివారం మండలంలోని బడెంపల్లి గ్రామంలో దివ్యాం గులు సర్పంచ్ కవితాశ్రీనివవాస్రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రస్తుతం ప్రతినెలా రూ.3016 వస్తుండగా.. వచ్చే నెల నుంచి రూ. 4,116 రానున్నదని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దివ్యాంగులు, రైతులు, మహిళలు , యువకులు పాల్గొన్నారు.
షాబాద్, జూన్ 10 : దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఇప్పటికే ఆసరా పథకం ద్వారా దివ్యాంగులకు ప్రతినెలా రూ.3,016 పింఛన్ అందిస్తున్న సర్కార్ దానికి మరో రూ.వెయ్యి పెంచి వచ్చే నెల నుంచి చెల్లించాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 24 మండలాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 16 మున్సిపాలిటీల్లో మొత్తం 27,707 మంది దివ్యాంగులున్నారు. వీరందరికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్ధి చేకూరనున్నది. ఆసరా పథకం ద్వారా వృద్ధు లు, వితంతువులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 అందిస్తున్నది. వచ్చే నెల నుంచి రూ.4,116 అందనున్నాయి.
సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అండగా ఉంటున్నారు. ఇప్పటికే ప్రతినెలా పింఛన్ పంపిణీతోపాటు సబ్సిడీ రుణాలు, వాహనాలు, విద్యాభ్యాసం చేస్తున్న వారికి ల్యాప్టాప్లు అందిస్తూ దన్నుగా నిలిచారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మరో రూ. వెయ్యి పెంచి మాపై మరోసారి ప్రేమను చాటారు. ఇలాంటి నాయకుడు దేశానికి ప్రధాని ఐతే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.
-చుక్క వెంకటయ్యగౌడ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇన్చార్జి, ఆమనగల్లు
తెలంగాణ ప్రభుత్వంలో దివ్యాంగులు మనోధైర్యంతో జీవిస్తున్నారు. తెలంగాణ రాక ముందు దుర్భర జీవితాన్ని గడిపారు. కాగా.. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే వారికి మంచి రోజులొచ్చాయి. ప్రతినెలా వస్తున్న పింఛన్ డబ్బులతో ఆనందంగా జీవిస్తున్నారు.
– నర్సింహాచారి, దివ్యాంగుల సమాఖ్య
జిల్లా అధ్యక్షుడు , చిలుకూరు, మొయినాబాద్
గత ఉమ్మడి ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ.500 పింఛన్ ఇస్తే ఏ ఖర్చులకు సరిపోవి కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే మా బతుకులకు భరోసా వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రతినెలా రూ.3,016పింఛన్ను అందిస్తూ ఆదుకుంటున్నారు. పెరిగిన ధరల దృష్ట్యా వచ్చే నెల నుంచి మరో రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మాలాంటి వారికి భరోసా ఉంటుంది. -సంగయ్య, ఎన్కతల, మోమిన్పేట
సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. ప్రస్తుతం ప్రతినెలా పంపిణీ చేస్తున్న రూ. 3,016కు అదనంగా వచ్చే నెల నుంచి మరో రూ.వెయ్యి పెంచి పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. దివ్యాంగులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు జీవితాం తం రుణపడి ఉంటా.
-నర్సింహులు, పెద్దేముల్ గ్రామం, పెద్దేముల్
తెలంగాణ వచ్చిన తర్వాతే దివ్యాంగులకు మేలు జరుగుతున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ప్రతినెలా రూ. 500 ఇచ్చేవారు. కానీ. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బాధలను గుర్తించి ప్రస్తుతం ప్రతినెలా రూ.3,016 పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి మరో రూ.వెయ్యి పెంచి చెల్లిస్తామని సీఎం చెప్పడం విని చాలా సంతోషించా. -మున్నూరు నర్సింహులు, లగచెర్ల, దుద్యాల మండలం
ఆమనగల్లు, జూన్ 10 : సీఎం కేసీఆర్ దివ్యాంగుల పక్షపాతి అని జడ్పీటీసీ నేనావత్ అనురాధ అన్నారు. ఆమనగల్లు మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు పింఛన్ డబ్బుల పెంపును హర్షి స్తూ హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్నారన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను జరుపుకొంటున్న తరుణంలో దివ్యాంగులకు ప్రతినెలా ఇస్తున్న రూ. 3,016 పింఛన్ డబ్బులకు అదనంగా మరో రూ. వెయ్యి చెల్లిస్తామని.. ఈ పెంపు వచ్చే నెల నుంచే ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, దివ్యాంగుల సం క్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, నియోజకవర్గ ఇన్చార్జి వెంకటయ్య, దివ్యాంగుల సంక్షేమ సంఘం మాడ్గుల, తలకొండపల్లి మండలాల నాయకులు కొండల్, మల్లేశ్, ప్రభాకర్, ఆనంద్, యాదగిరి, శ్రీను, సైదులు, శంకర్, రాములు, బీఆర్ఎస్ మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్, అల్లాజీ, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్ , యూ త్ వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, ప్రసాద్, రమేశ్, భాస్కర్, ఆనంద్, హరిలాల్, విజయ్, చంద్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
గత ఉమ్మడి ప్రభుత్వాలు ఉన్నప్పుడు నాకు రూ.200 పింఛన్ వచ్చేది. ఆ డబ్బు దేనికి సరిపోయేది కాదు. నాకు కాళ్లు పనిచేయకపోవడంతో ఏ పనిని చేసుకోలేను. తెలంగాణ వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ సార్ నాకు ప్రతినెలా రూ.3,016 అందించి ఆదుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వచ్చే నెల నుంచి మరో రూ.వెయ్యి పెంచి అందిస్తామని సీఎం ప్రకటించ డం ద్వారా నాలాంటి దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్ సారుకు దండాలు.
-ఆంగోతు సాలమ్మ, దివ్యాంగురాలు, ఇబ్రహీంపట్నం రూరల్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దివ్యాంగులకు మంచి జరుగుతున్నది. ఇప్పటికే ప్రతినెలా రూ.3,016 పింఛన్ అందిస్తూ ఆదుకుంటున్న ప్రభు త్వం .. వచ్చే నెల నుంచి మరో రూ.వెయ్యి పెంచి అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి పెద్ద మనసున్న నాయకుడు.. ఆయనకు రుణపడి ఉంటా. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఇచ్చిన పింఛన్ సరిపోయేది కాదు. -శ్రీనివాస్, దామరిగిద్ద గ్రామం,
చేవెళ్ల, దివ్యాంగుడు