కొడంగల్ : జిల్లా కేంద్రంలోని కోర్టుకు సంబంధించిన భూమిని పరిశీలించేందుకు వచ్చిన జైళ్లశాఖ డీఐజీ మురళీబాబు కొడంగల్ విచ్చేసి సబ్జైల్ను బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జైళ్ల శాఖకు సంబంధించి 9 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 101లో 100 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. కాగా ప్రస్తుతం ఈ భూమిని ఇతరాత్ర శాఖలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా ఎస్పీ నారాయణను కలిసి మాట్లాడటం జరిగిందన్నారు. జైళ్లశాఖకు సంబంధించిన 100ఎకరాల భూమిని వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్ధి ఖైదీలకు జీవనోపాధి కల్పించేందుకు చర్యల తీసుకునే దిశగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. స్థల పరిశీలన అనంతరం కొడంగల్ కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించేందుకు విచ్చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో నిర్మాణం పూర్తి కాబడ్డ జైలు వృథాగా ఉండిపోయిందని, ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
పరిగి పట్టణంలోని జైల్లో 60మందికి అనుకూలంగా ఉండగా ప్రస్తుతం 100మందిని ఉంటున్నారని, కొడంగల్ సబ్జైల్ ప్రారంభం అయితే కొడంగల్, తాండూర్ ప్రాంత ఖైదీలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. కొడంగల్కు సంబంధించి ఖైదీలను మహబూబ్నగర్ జైలుకు తరలించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, కొడంగల్ సబ్ జైల్లో 40మంది ఖైదీలను ఉంచేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. కొంత వరకు చిన్నపాటి మరమ్మతులు చేయించాల్సి ఉందని పూర్తి చేసిన అనంతరం త్వరలో ప్రారంభించేదుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైళ్లశాఖ అధికారి రాంచందర్, పరిగి జైల్ అధికారి హర్షవర్దన్తో పాటు కొడంగల్ సీఐ అప్పయ్య పాల్గొన్నారు.