వికారాబాద్ : జిల్లాలోని ఇంటర్మీడియట్లో విద్యార్థులు చేరేందుకు గడువు పొడగించినట్లు జిల్లా ఇంటర్బోర్డు అధికారి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 9, రెసిడెన్సియ ల్, మాడల్, సోషల్ వెల్ఫేర్, కేజీబీవీలు 38, ప్రైవేటు జూనియర్ కళాశాల 23 మొత్తం 70 కళాశాలలు ఉన్నాయన్నారు. ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరేందుకు ఈ నెల 30 వరకు చివరి తేది ఉన్నట్లు ఇంటర్ బోర్డు అధికారి తెలిపారు.