ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 8 : కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీల్లో భాగంగా శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు గైడ్లైన్స్ జారీచేశారు. తెలంగాణలో పుట్టిన మహిళకు సంబంధించి ఏ దైనా గుర్తింపు కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వీలు కల్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం మధ్యాహ్నం మహిళలకు బస్సు ల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అందులో భా గంగానే రంగారెడ్డి జిల్లాలోని అన్ని డిపోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఆయా డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.
నగరంతో పా టు శివారు ప్రాంతాల్లో సిటీ ఆర్డినరీ బ స్సులు, మెట్రో ఎక్స్ప్రెస్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డినరీ బస్సులు, పల్లె వె లుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బ స్సుల్లో ప్రయాణం చేసే మహిళలు తమ వెంట ఆధార్ లేదా ఓటర్ ఐడీతో పాటు ఇతర ఏదైనా గుర్తిం పు కార్డును తీసుకు రావాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. నేటి మధ్యాహ్నం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, హయత్నగర్-1, 2, బండ్లగూడ, మిథాని తదితర డిపోలు జిల్లా పరిధిలోకి వస్తాయి. ఈ డిపో పరిధిలోని బస్సు ల్లో నేటి నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో 118 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులుండగా, ప్రతిరోజూ సుమారు 30రూట్లల్లో ఈ బస్సులు తిరుగుతున్నాయి.
ఈ డిపో పరిధిలోని అన్ని రూట్లల్లో మ హిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రా నున్నది. జిల్లా వ్యాప్తంగా ఈ మేరకు డిపో మేనేజర్లకు ఆదేశాలు రావడంతో ఆయా రూట్లల్లో బ స్సులను నడిపే డ్రైవర్, కండక్టర్లకు కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించడంతో పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.