రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ) : కులవృత్తులకు జీవం పోయాలి.. గొల్లకురుమల జీవితాలు మా రాలి.. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చి సొంత ఊరిలోనే ఆర్థికంగా ఎదగాలి.. ఇంటిల్లిపాదీ మెతుకు తినాలె..’ అన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఆరేండ్ల క్రితం ప్రారంభించిన గొ ర్రెల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో మొదటి విడతలో రూ.1.32 కోట్లను వెచ్చించి 11,685 యూనిట్లను గొల్లకురుమలకు పంపిణీ చేసింది. రూ.300 కోట్లను ఖర్చు చేసి గతేడాది జూన్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చు ట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ పంపిణీకి బ్రేక్ పడింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం అమలుపై ‘చేయి’ఎత్తేసింది. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెల పంపిణీని చేపడతామని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీకీ నీళ్లొదిలింది. గొర్రెల కోసం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు డీడీలను వాపస్ ఇస్తున్నది. ప్రభుత్వ తీరుపై గొల్లకురుమలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించి 735 మందికి గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉన్నది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీపై ఎన్నికల్లోనూ హామీ ఇవ్వడంతో గొల్లకురుమలు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం కొనసాగింపుపై ఎటు వంటి స్పష్టత ఇవ్వలేదు. గొర్రెలు పంపిణీ చేయాలని పలుమార్లు లబ్ధిదారులు ఆందోళనలు కూడా చేశారు. లేనిపక్షంలో వాటా ధనాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో చివరకు ప్రభు త్వం ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు సంకల్పించి డీడీలు వాపస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. గొర్రెల యూ నిట్కు వాటా ధనం చెల్లించిన వారి ఖాతాల్లో తిరిగి జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందా యి. ఈ మేరకు వారి ఖాతాల్లో డబ్బులు చేసేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఖాతాల్లో జమ చేయాలో తెలపాలంటూ ఓ ఫార్మాట్ను తయారు చేసి రైతుల వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం 102 మందికి సంబంధించి వివరాలు రావడంతో వారికి డబ్బులు చెల్లించేందుకు కలెక్టర్కు ఫైల్ పెట్టినట్లు పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా వారి వివరాలు వచ్చిన వెంట నే వారి ఖాతాల్లోనూ డబ్బులను జమ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇన్నాళ్లుగా గొర్రెల కోసం నిరీక్షించిన గొల్లకురుమలు మండిపడుతున్నారు.
గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పం పిణీ పథకం జిల్లాలో అద్భుత ఫలితాలను ఇచ్చింది. జిల్లాలో 2017 జూన్లో మొదటి విడతలో 11,685 మంది గొల్లకురుమలకు 2,45,385 గొర్రెలను పంపిణీ చేసింది. తొలి విడతలో సబ్సిడీపై రూ.1.25 లక్షల విలువైన 21 గొర్రెలను రూ.31,750కే అందించిన అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత యూనిట్ విలువను రూ.1.75 లక్షలకు పెంచి లబ్ధ్దిదారుడి వాటాగా రూ.43,450కే అందించింది. గతేడాది నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జూన్ 9న జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. 2 వేల మంది గొల్లకు రుమలు డీడీలు చెల్లించి పథకానికి దరఖాస్తు చేసుకోగా..అసెంబ్లీ ఎన్నికల నాటికి 1,265 యూనిట్లకు అధికారులు గొర్రెలను పంపిణీ చేశారు. ఎన్సీడీపీ రుణం ఇవ్వకుండా కేంద్రం మోకాలొడ్డినా.. బీఆర్ఎస్ ప్రభుత్వమే సొంతంగా నిధులు సమకూర్చుకుని రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించింది. జీవాలు అనారోగ్యానికి గురైతే సత్వర వైద్యం అందించేందుకు సంచార వాహనాలను సైతం ఏర్పాటు చేసింది. దూరదృష్టితో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సక్సెస్ కావడంతో నేడు ఏ గ్రామంలో చూసినా సర్కారు పంపిణీ చేసిన గొర్రెల మందలే కనిపిస్తున్నాయి. ఈ పథకం ప్రారంభించక ముందు జిల్లాలో 5.35 లక్షలు ఉన్న గొర్రెల సంఖ్య 2023 సంవత్సరానికి వచ్చేసరికి 7,67,125కు పెరిగింది. వలసలకు సైతం ఈ పథకం చెక్ పెట్టింది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రస్తుతం అన్ని కాలాల్లోనూ సమృద్ధిగా నాణ్యమైన మాంసం లభిస్తున్నది. గొర్రెల సంపద మూడింతలు పెరిగి ఆత్మగౌరవంతో జీవిస్తున్న గొల్లకురుమల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది.