మంచాల, నవంబర్ 23 : ఈ నెల 8 నుంచి ప్రారంభమై బుగ్గ జాతర ఉత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తుల పెద్దఎత్తున తరలివచ్చి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. 15 రోజులపాటు జరిగిన ఉత్సవాలకు వచ్చిన భక్తులకు కొంగర విష్ణువర్ధన్రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 3లక్షల మంది కార్తిక పుణ్యస్నానాలను ఆచరించారు. సుమారు రూ.5లక్షల వరకు అదాయం సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు.