రంగారెడ్డి, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రెండు రోజులుగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. వానకాలం సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వరుణుడి కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రస్తుత ముసురు వర్షాలు రైతన్నల ఆశలను సజీవం గా నిలుపుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి సమృద్ధిగా వర్షం నీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుత వర్షాలతో ప్రజలు కూడా ఇబ్బందు లు పడుతున్నారు. బుధవారం శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10.5మి.మీ.ల వర్షం కురిసింది. గండిపేటలో 9.5 మి.మీ.లు, మొయినాబాద్లో 6.7, శంకర్పల్లిలో 6.5, రాజేంద్రనగర్లో 6.4, అబ్దుల్లాపూర్మెట్లో 5.4, చేవెళ్లలో 4.9, షాబాద్లో 3.2, తలకొండపల్లిలో 2.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తున్న ది. కురుస్తున్న వర్షానికి వాతావరణం చల్లబడింది. చలిగాలులు వీస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు, మో స్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాండూరులో అత్యధికంగా 34.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మర్పల్లిలో 0.22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మర్పల్లిలో 0.22మిల్లీమీటర్ల వర్షపాతం, మోమిన్పేటలో 28.9, నవాబుపేటలో 24.4, వికారాబాద్లో 26.4, పూడూరులో 26.7, పరిగిలో 20.6, కుల్కచర్లలో 16.3, దోమలో 15.5, బొంరాస్పేటలో 17.4, ధారూరులో 26.4, కోట్పల్లిలో 30.7, బంట్వారంలో 23.6, పెద్దేముల్లో 0.24, తాండూరులో 34.2, బషీరాబాద్లో 25.1, యాలాలలో 20.3, కొడంగల్లో 20.3, దౌల్తాబాద్లో 19.1, చౌడాపూర్లో 13.7, దుద్యాలలో 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉద యం 10 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంట ల వరకు కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.