వికారాబాద్, జూన్ 11 : కవులు, కళాకారుల ను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగా ణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. శశాంక్ ప్రదర్శించిన స్వాగత నృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కవులు, కళాకారులు, రచయితలు తెలంగాణలో తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని పాట, పద్యరూపంలో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీచైర్పర్సన్ మా ట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి ఆధునిక కా లం వరకు కవులు, పండితులు, రచయితల ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా వారిలో ఉన్న సృజనాత్మకతను బయటకు తెచ్చి సమాజంలో మార్పుకోసం కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చే దిశగా సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని జాగృతం చేసేది కవులు, కళాకారులేనని.. మంచి, చెడులను ప్రజల్లోకి తీసుకెళ్లి సమాజ మార్పునకు ఎంతగానో కృషి చేస్తారన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిని స్మరించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. వచన కవితల సంకలా న్ని పుస్తక రూపంలో తీసుకొస్తామన్నారు. సాహిత్య దినోత్సవంలో పాల్గొన్న 36 మంది కవులు, కళాకారులు, రచయితలను శాలువా లు, జ్ఞాపికలతో సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సుశీల్కుమార్గౌడ్, డీఈవో రేణుకాదేవి, డీఐ వో శంకర్నాయక్, చంద్రకళ, సురేశ్బాబు, సత్తయ్య పాల్గొన్నారు.