కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరు దివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారిచూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది భారత రాష్ట్ర సమితి. దేశంలోని అసమానతల కారు చీకట్లను తరిమి వేసేందుకు కోటి సూర్య ప్రకాశకుడిలా మారాడు చంద్రశేఖరుడు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అభివృద్ధికి రోల్ మాడల్గా మార్చారు. ఒకనాడు కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతాల్లో సిరులు పండేలా చేసిన ఉద్యమ వీరుడు.. మరో అడుగు ముందుకు వేశారు. అద్భుతమైన జలవనరులు, సాగు భూమి, సమ శీతోష్ణ వాతారవణం కలిగిన భారతదేశాన్ని అతిపెద్ద ఫుడ్ చైన్ దేశంగా మార్చేందుకు నడుం బిగించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో భారత రాష్ట్ర సమితి ప్రస్థానాన్ని ప్రారంభించారు. రత్నగర్భ అయిన మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలిపేందుకు ఆర్థిక, పర్యావరణ, మహిళా సాధికారత, జల, రైతు విధానాలను రూపొందిస్తామని ప్రకటించి సరికొత్త మార్పునకు నాంది పలికారు.
‘కరోనా క్లిష్ట సమయంలో దేశమంతా ఆర్థికంగా వెనుకకు పోయినా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణతో నిలదొక్కుకున్నది. చిన్న రాష్ట్రం అని అవహేళన చేసిన వారే ఇప్పుడు తెలంగాణను చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి తీసుకువచ్చాం. అదే రీతిలో దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు భారత రాష్ట్ర సమితిపై ఉన్నది. కర్నాటక ఎన్నికలతో మన జాతీయ పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభిద్దాం. కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా, నూతన విధానాలను అమల్లోకి తెద్దాం. అద్భుతమైన యువ సంపత్తిని నిర్వీర్యం చేస్తున్నారు. యువతను మతోన్మాదులుగా మారుస్తున్నారు. దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉన్నది. ఇది బీఆర్ఎస్ నుంచే ప్రారంభం కావాలె. 60 లక్షలున్న మన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా దీనికి నడుం బిగించాలి.’
– బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
సీఎం కేసీఆర్కు స్వాగతం పలుకుతున్న విప్ గాంధీ, ఎంపీ రంజిత్రెడ్డి
‘హైదరాబాద్ ఓ పవర్ ఐల్యాండ్. చరిత్ర చెబుతున్న సత్యమిది. దేశంలోని ఎన్నో నగరాల కంటే ముందుగా మన సిటీకి విద్యుత్ వచ్చింది. అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకొని అద్భుతమైన కాస్మోపాలిటన్ సిటీగా ఆవిర్భవించింది. భూంకపాలు రాకుండా, భూగోళం మీదనే సేఫేస్ట్గా ఉండే నగరం మనది. చరిత్ర, వర్తమానమే కాదు హైదరాబాద్ భవిష్యత్ కూడా ఎంతో గొప్పగా ఉండబోతున్నది. నీళ్ల గోస, కరెంటు బాధలు లేకుండా చేసుకున్నాం. రవాణా వ్యవస్థను ఆధునీకరించి ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేసుకుంటున్నాం. మెట్రోను నలుదిశలా విస్తరించుకుంటున్నాం. ఈరోజు మైండ్స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మెట్రోను విస్తరిస్తాం. ఇప్పటికే విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్కు మరింత గుర్తింపు తీసుకువస్తాం.’
– మెట్రో పనుల శంకుస్థాపనలో సీఎం కేసీఆర్
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి హెచ్ఎండీఏ తరఫున రూ.625 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్కు అందజేస్తున్న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, చిత్రంలో మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, శ్రీనివాస్యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీలు కేశవరావు, నాగేశ్వర్రావు, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కిషన్రెడ్డి తదితరులు
భారీ శిలాఫలకం
మైండ్స్పేస్ వద్ద ‘హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్’ పేరిట భారీ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కాగా శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ బస్సు దిగిన వెంటనే నినాదాలతో హోరెత్తించారు. దేశ్ కీ నేత, జై బీఆర్ఎస్ అంటూ స్లోగన్స్ మిన్నంటాయి.
సభకు హాజరైన మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, శ్రీనివాస్యాదవ్, మహమూద్అలీ, మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ మహేంద్రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్ తదితరులు
తెలంగాణకు వెల్లువలా పెట్టుబడులు
సీఎం కేసీఆర్ దూరదృష్టి, ఆయన చేసిన అభివృద్ధి వల్ల రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తరుణంలో సీఎం తొలిసారి రంగారెడ్డి జిల్లాకు రావడం మా అదృష్టం. మెట్రో ఫేజ్-2 వల్ల హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల అందరికీ ఎంతో మేలు జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా నలుమూలల ఎన్నో కొత్త కంపెనీలు, పెద్ద సంస్థలు, పారిశ్రామిక కాలనీలు ఆవిర్భవిస్తున్నాయి. రవాణా పరంగా ఆయా కంపెనీలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక విజన్తో పని చేస్తున్న సీఎం కేసీఆర్. ఆయన ఆలోచనా విధానం వల్లే రాష్ట్రం ఇత పురోభివృద్ధి సాధించింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్ల లింకు రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు నిర్మించి నగరంతో పాటు శివారు ప్రాంతాలను కూడా ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోని మిగతా నగరాలకు హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తున్నది.
– పి.సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
భావి ప్రధాని కేసీఆరే
స్వరాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ద్వారా ఉద్యమం చేసి తెలంగాణను సాధించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ దేశ గతిని మార్చనున్నారు. భారత దేశానికి భావి ప్రధాని మీరే అవుతారు. అందు కోసం మేమంతా మీ వెంటే ఉంటాం. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తీరును రాష్ట్ర ప్రజలే కాకుండా పొరుగు రాష్ర్టాల వాళ్లు సైతం పొడుగుతున్నారు. రాష్ట్రం కోసం, మా జిల్లా కోసం, మా నియోజకవర్గ ప్రజల బాగోగుల కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయం.
– ప్రకాశ్గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ కాన్వాయ్కి ఘన స్వాగతం పలుకుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణ భవన్ ముందు బీఆర్ఎస్ నేతల సంబురాలు