తాండూరు రూరల్ : తెలంగాణ, కర్నాటక సరిహద్దులో పోలీసు నిఘాను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు బుధవారం చించోలి తాలుకలో జరిగిన బార్డర్ సమావేశం నిర్ణయించారు. ఈ సమావేశానికి తాండూరు, కొడంగల్కు చెందిన సీఐ జలేందర్రెడ్డి, అప్పయ్యతోపాటు కరణ్కోట ఎస్సై మధుసూధన్రెడ్డిలు హాజరయ్యారు. అదే విధంగా కర్నాటక రాష్ట్రానికి చెందిన ఎస్పీ ఇషాంత్ పంత్, కలబురిగి అడిషనల్ ఎస్పీ ప్రసన్న దేశాయితోపాటు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు క్రైమ్ విషయంలో పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు.
అదే విధంగా ఇరు రాష్ట్రాల్లోని నేరస్తులపై కూడా చర్చించారు. రెండు రాష్ట్రాల్లో అదృశ్యమైన వ్యక్తుల పై కూడా పోలీసులు చర్చించుకున్నారు. దీంతో పాటు గుర్తు తెలియని శవాలపై కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి తెలిపారు.