తాండూరు, జనవరి 3: తాండూరు నియోజక వర్గం అభివృద్ధితో పాటు ప్రజా సేవే లక్ష్యం గా పాలన సాగిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంలో 25వ వార్డుతో పాటు, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో ఆరు గ్యారెంటీ దర ఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే నేరుగా దర ఖా స్తులను స్వీకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాల వద్ద అధికా రులు, ప్రభుత్వ సిబ్బంది దరఖాస్తులను ప్రజల నుంచి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో తాండూరుకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని విధాల అభివృద్ధి పనులను చేస్తామ న్నారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూ చించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తాండూరు రూరల్: ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలను నిరుపేదలకు అందేలా చూస్తా మని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మండలంలోని సంగంకలాన్, మల్కాపూర్, కోటబాసుపల్లి, కొత్లాపూర్ గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామ సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆరు గ్యారెంటీలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపిస్తామన్నారు. ప్రజాసంక్షేమ ధ్యేయంగా ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, జడ్పీటీసీ గౌడి మంజుల, వైస్ ఎంపీపీ స్వరూపా వెంకట్ రాంరెడ్డి, సర్పంచులు నాగార్జున, సాయిలు, మేఘనాథ్గౌడ్, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
కులకచర్ల : పేద సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తామని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామని, దీని ద్వారా ప్రతి పేదవానికి పథకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీఎస్ ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ లక్ష్మీఆనంద్, మండల ప్రత్యేక అధికారి సరళాదేవి, గ్రామ ఉపసర్పంచ్ చంద్రభూపాల్రావు తదితరులు పాల్గొన్నారు.
పరిగి: అర్హులందరూ అభయహస్తం కింద లబ్ది పొందేందుకు దరఖాస్తు చేసు కోవాలని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ సూచించారు. బుధవారం పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమం లో పాల్గొన్న వారు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయహస్తం కింద లబ్ధి పొందడానికి అర్హులైన వారు పూర్తి వివరాలతో దరఖాస్తులు అందజే యాల న్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని వారు అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో దయానంద్, సర్పంచ్ జి.అశోక్వర్దన్రెడ్డి, ఎంపీటీసీ జి.పద్మమ్మ, నాయకుడు వెంకట్ రాములు పాల్గొన్నారు.
వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని గోధుమగూడ, పులుమద్ది గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమాలను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారం భించారు. ప్రభుత్వం చేపట్టే ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రజలకు వారు వివరించారు. దరఖాస్తు ఫారాలను నింపేందుకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సుభాషిణి, ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య, మండల వ్యవసాయాధికారి జ్యోతి, ఎంపీవో నాగరాజు, సర్పంచ్లు మాధవరెడ్డి, అనిత తదితరులు పాల్గొన్నారు.
బషీరాబాద్ : పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎంపీపీ కరుణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని భోజ్యానాయక్తండాలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ పథకాలు పొందుతున్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సిన అవ సరం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, ఎంపీడీవో రమేశ్, సర్పంచ్ శాంతి తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులతో పాటు మండలంలోని అంగడిరైచూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు. అంగడిరైచూర్ ప్రజాపాలన కార్య క్రమంలో పాల్గొన్న ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మాట్లాడుతూ రేషన్ కార్డు లేని వారు కూడా ఆరు గ్యారెంటీ పథకాలకు ధరఖాస్తు చేసుకొవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ గోవింద్తో పాటు వైస్ ఎంపీపీ రహమత్ఖాన్, మాజీ జడ్పీటీసీ భాస్కర్, ఎంపీడీవో పాండు, డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్పేట: ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి రాంరెడ్డి కోరారు. బుధవారం మండలంలోని బురాన్పూర్, ఏర్పుమళ్ల, రోటిబండతండా, లగచెర్ల, చిల్ముల్మైలారం,నాస్కంపల్లి, కాకర్లగండితండాల్లో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామ సభల్లో ఎంపీడీవో వెంకన్గౌడ్, తాసిల్దార్లు వెంకటేశ్, దానయ్య, డీటీ రవికుమార్, ఆర్ఐ రవిచారి తదితరులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
దోమ: మండల పరిధిలోని కిష్టాపూర్, పలుగుతండా, గంజిపల్లి, మైలారం, ఖమ్మం నాచారం, గొట్లచెల్కతంగా గ్రామ పంచాయతీలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు. గొట్లచెల్కతండాలో తహసీల్దార్ పురుషోత్తంతో కలిసి సర్పంచ్ లక్ష్మణ్నాయక్ ప్రజా పాలన సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు, అధికారులు ప్రజా ప్రతినిథులు పాల్గొన్నారు.
మర్పలి:్ల మండలంలోని వీర్లపల్లి, సిరిపురం, జంషాదపూర్, గనాపూర్ గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించినట్లు డీఎల్పీవో అనిత తెలిపారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఆరు వరకు అర్హులందరూ గ్రామసభల్లో పాల్గొని గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో రాజమల్లయ్య, ఏపీఎం మధుకర్, ఏపీవో అంజిరెడ్డి, నాయకులు సుభాస్యాదవ్, రవీందర్, ఖలీమొద్ధీన్, శేఖర్యాదవ్, ప్రభాకర్, సురేశ్, రాములు యాదవ్ ఆయా గ్రామాల సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు
ధారూరు: మండల పరిధిలోని మోమిన్కలాన్, అంతారం, దోర్నాల్, ధారూరు స్టేషన్ గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నారెడ్డి, ఎంపీవో షఫీఉల్లా, ఆయా గ్రామాల సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, నర్సిరెడ్డి, సుజాత, రేణుక, తహసీల్దార్ భువనేశ్వర్, ఏపీవో సురేశ్కుమార్, మండల వ్యవసాయ అధికారి ఝాన్సీలక్ష్మి, ఏఈవో సంజువ్ రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.