షాద్నగర్టౌన్, జనవరి 12: నేటితరం యువతకు స్ఫూర్తి ప్రదాత, ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా పట్టణంలోని బీఏఎం కళాశాలలో నిర్వహించిన జయంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పన మహనీయుడు స్వామి వివేకానందుడన్నారు. అదే విధంగా పట్టణంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుడి జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ రాజేశ్వర్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, సుధాకర్, భిక్షపతి, చంద్రశేఖర్, మల్లేష్, రంగయ్య, నర్సింహ, రాఘవేందర్, అశోక్, అభి, గోపాల్, అశోక్ పాల్గొన్నారు.
నందిగామలో..
నందిగామ : నందిగామ మండల పరిధిలోని వెంకమ్మగూడ, నర్సప్పగూడ గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాల్రెడ్డి, సర్పంచ్ వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, ఉప ర్పంచ్ కుమార్గౌడ్, యువసత్తా అధ్యక్షుడు లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదయ్య, నాయకులు వీరేందర్గౌడ్, శ్రీశైలంయాదవ్, నర్సింహాగౌడ్, యాదగిరిగౌడ్, మెండె కృష్ణ, అశోక్ పాల్గొన్నారు.
పెంజర్లలో..
కొత్తూరు : కొత్తూరు మండలంలోని పెంజర్లలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ ఆవరణలో వివేకానంద చిత్రపటానికి నివాళులుర్పించారు. కార్యక్రమంలో పెంజర్ల సర్పంచ్ మామిడి వసుంధరమ్మ, గ్రామస్తులు ఎం. సిద్ధార్థరెడ్డి, జీహెచ్ఎం జగదీశ్వర్రెడ్డి, హెచ్ఎం ఆంజనేయులు, ఐకేపీ సభ్యులు ఎస్ఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్, యువకులు నర్సింగ్, అభిషేక్, ప్రశాంత్, మ్యాజిక్ బస్ టీం సభ్యులు పాల్గొన్నారు.
మహాలింగాపురంలో
శంకర్పల్లి : మహాలింగాపురంలో వివేకానంద చిత్ర పటానికి శంకర్పల్లి పీఏసీఎస్ డైరక్టర్ రాజశేఖర్రెడ్డి నివాళులర్పించారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
హాజిపల్లి గ్రామంలో ..
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలో వివేకానంద జయంతిని ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, యువత నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు.
షాబాద్లో..
షాబాద్ : మండల పరిధిలోని షాబాద్, బోడంపహాడ్, మన్మర్రి, తాళ్లపల్లి, నాగరగూడ తదితర గ్రామాల్లో వివేకానందుడి విగ్రహాలు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు నివాలర్పించారు.
ఆమనగల్లులో
ఆమనగల్లు : పట్టణంలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీటీసీ నేనావత్ అనురాధ హాజరై వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాలపురం శ్రీనివాస్రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు జంతుక అల్లాజీ నాయకులు నిరంజన్, రామకృష్ణ, బాలస్వామి, భీమయ్య, వెంకటేశ్, బాలకృష్ణ, రమేశ్, మల్లేశ్, గణేశ్, రంజిత్, పాల్గొన్నారు.
పసుమాములలో
పెద్దఅంబర్పేట : జయంతిని పురస్కరించుకుని పసుమాములలోని వివేకానందుడి విగ్రహానికి స్థానికులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు.
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో..
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వివేకానంద జయంతిని నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో యువజనసంఘాల నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, గోవర్ధన్, సతీష్ముదిరాజ్, శశిధర్, సంతోశ్, ప్రవీణ్, పవన్, నర్సింహ, విజయ్, అర్జున్, అనిల్, రవి పాల్గొన్నారు.
స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి చేయాలి
కడ్తాల్ : మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీటీసీ దశరథ్నాయక్ హాజరయ్యారు. కార్యక్రమంలో యువజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు రాఘవేందర్, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు మాధవులు, ఉప సర్పంచ్ రామకృష్ణ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి లక్పతినాయక్, నాయకులు కృష్ణ, గోపి, నాగరాజు, మహేశ్, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, భగీరథ్, ఇమ్రాన్, భాస్కర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
కేశంపేటలో..
కేశంపేట : కేశంపేట మండలంలోని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఎంపీపీ రవీందర్యాదవ్, కేశంపేట సర్పంచ్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు పి.లక్ష్మీనారాయణ, పర్వత్రెడ్డి, భూపాల్రెడ్డి, మురళీమోహన్, రంగారెడ్డి, పాల్గొన్నారు.