శంకర్పల్లి : కుటుంబ కలహాలతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్వర్తి గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్వర్తి గ్రామానికి చెందిన గుండాల శ్రీలత(29) ఆమె భర్త శ్రీనాథ్ ప్రతి రోజు మద్యం తాగి భార్య శ్రీలతతో గొడవకు దిగేవాడు. రోజు మాదిరిగానే శుక్రవారం మద్యం తాగి ఇంట్లో గొడవకు దిగాడు. సాయంత్రం అతని పిల్లలు బిర్యాని తీసుకరమ్మని అడగడంతో అతని కారులో శంకర్పల్లికి వస్తుండగా రామంతాపూర్ సమీపంలో రాజేంద్రగర్ ట్రాఫిక్ పోలీసులకు డ్రంగ్ అండ్ డ్రైవ్లో పట్టుబడటంతో గ్రామ పెద్దలను పిలిపించి పోలీసులు అతడిని సురక్షితంగా గ్రామానికి చేర్పించారు.
మద్యం తాగి ఎందుకు వెళ్లావని శ్రీలత భర్తను అడగడంతో ఇద్దరి మద్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీలత ఇంటి ఎదురుగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.