మొయినాబాద్, ఫిబ్రవరి18 : ప్రజారంజక పాలన ప్రజలకు అందించడంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని చేవెళ్ల ఎమ్మెలే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని అజీజ్నగర్ గ్రామం సర్పంచ్ సంధ్య భర్త మాజీ ఉపసర్పంచ్ బండ్లగూడం శ్రీశైలం టీఆర్ఎస్ పార్టీలో చేశారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందన్నారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ కె అనంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్,రావూఫ్, ప్రధానకార్యదర్శి నర్సింహగౌడ్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ శ్రీహరియాదవ్,ఎంపీటీసీలు రితీష్రెడ్డి, అర్జున్, మాజీ ఎంపీటీసీ మాణిక్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.