పరిగి, డిసెంబర్ 18 : పరిగి, కొడంగల్ నియో జకవర్గాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రయ త్నం చేస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వెల్లడించారు. సోమవారం పరిగి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన శాసనసభ స్పీకర్ ప్ర సాద్కుమార్ పరిగిలోని ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల స మావేశంలో మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన ఉండేదని, వికారాబాద్ మెడికల్ కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీ సుకురావడంతోపాటు పరిగి, కొడంగల్కు మెడికల్ కాలేజీలు తీసుకొస్తామన్నారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాలు వంద రోజుల్లో ప్రతి ఇంటికీ అందేలా కృషి చేస్తామని చెప్పారు. వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి, స్పీకర్ పదవులు దక్కాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో వికారాబాద్ ప్రాంతం, పాత రంగారెడ్డి జిల్లాను అభివృద్ది చేస్తామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కు సాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నా రు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్కుమార్ను ప లువురు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ వన్ అధ్యక్షుడు సిద్ధాంతి పార్థసారథి, మాజీ జడ్పీటీసీ పి.చంద్రయ్య, డీసీ సీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణప్రసాద్, ఆనందం, సీ నియర్ నాయకులు కె.రఘుమోహన్రెడ్డి, కె.హ న్మంతు, పాలాది శ్రీనివాస్ పాల్గొన్నారు.
కులకచర్ల : ఉచిత బస్ ప్రయాణం మహిళలకు వరంలా ఉపయోగపడుతున్నదని శాసనసభ స్పీ కర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మె ల్యే రామ్మోహన్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బు య్యని మనోహర్రెడ్డితో కలిసి ఆర్టీసీ ప్రయాణికులు, మహిళలతో మాట్లాడారు. అంతకు ముం దు అయ్యప్పకొండపై నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడి పూజలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కులకచర్ల మండల అధ్యక్షుడు బీఎస్ ఆంజనేయులు, చౌడాపూర్ మండల అధ్యక్షుడు అశోక్కుమార్, నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు.
పూడూరు : మండల పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూ ల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, తాండూరు ఎ మ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిలను పాఠశాల యాజమాన్యం సన్మాణించింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.