గ్రామాల్లో సౌర విద్యుత్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం ‘సోలార్ రూఫ్టాప్’ల ఏర్పాటుపై దృష్టి సారించింది. వికారాబాద్ జిల్లాలో తొలి విడుతలో 300 సోలార్ రూఫ్టాప్ల యూనిట్లను మంజూరు చేయాలని భావించిన ప్రభుత్వం.. ప్రతి మండలంలో 15 చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు ప్రాధాన్యమివ్వనున్నది. వ్యయంలో 50 శాతం స్త్రీ నిధి ద్వారా రుణం ఇప్పించనుండగా, ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందించనున్నది.
మిగతా పదిశాతం లబ్ధ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి గ్రామం నుంచి కనీసం ఒకరైనా ముందుకొస్తే మిగిలిన వారు కూడా ఏర్పాటుకు మొగ్గు చూపుతారని భావించిన సెర్ప్ అధికారులు ఏ గ్రామం నుంచి ఎంతమంది సౌర పలకల ఏర్పాటుకు ముందుకొస్తారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులు సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చి అధికారులకు దరఖాస్తులను సైతం అందించా రు. వీటి ఏర్పాటుతో గ్రామాలు సోలార్ వెలుగుల్లో మెరువనుండడంతోపాటు బిల్లుల భారం తగ్గనున్నది.
పరిగి, డిసెంబర్ 26: సోలార్ విద్యుత్ను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మరింత చౌకగా విద్యుత్ అందేలా చూ సేందుకు సర్కారు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను గ్రామాల్లో నెలకొల్పాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అవసరమైన ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సబ్సిడీని కూడా ఇస్తుండటంతో గ్రామాల్లోని పలువురు రైతులు దరఖాస్తు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఒకరైనా రూప్ టాప్ యూనిట్ను ఏర్పాటు చేసుకుంటే మిగిలిన ప్రజలూ ముందుకొచ్చే అవకా శం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే సెర్ప్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడంతో.. వా రు ఏ గ్రామం నుంచి ఎంతమంది సోలార్ రూప్ టాప్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొస్తారనే విషయమై సమాచారాన్ని సేకరిస్తున్నారు. వికారాబాద్ జిల్లాకు తొలి విడుతలో ప్రభుత్వం 300 సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. వీటి ఏర్పాటుతో గ్రామాలకు సౌర వెలుగులు రానున్నాయి.
స్వయం సహాయక సంఘాల సభ్యులకే..
సబ్సిడీ ద్వారా అందజేయనున్న సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉన్న వారికే అధికారులు కేటాయించనున్నారు. ఎంపిక చేసిన లబ్ధ్దిదారులకు రుణాలను స్త్రీనిధి ద్వారా ప్రభుత్వం అందించను న్నది. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం 40 శాతం సబ్సి డీ ఇస్తుండగా 50శాతం స్త్రీ నిధి నుంచి రుణంగా రానున్నది. లబ్ధ్దిదారులు 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాన్ని ఐదేండ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ యూనిట్ ఏర్పాటుకు లబ్ధ్దిదారు తప్పనిసరిగ్గా 160 నుంచి 200 చదరపు అడుగులకుపైగా ఆర్సీసీ బిల్డింగ్ను కలిగి ఉండటంతోపాటు ఉండాలి.
నెలకు కనీసం 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారై ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో రానున్న మూ డు నెలల్లో 300 సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటుతో గ్రామాలకు సౌర వెలుగులు రానున్నాయి.
ప్రతి మండలానికీ 15 చొప్పున ..
ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేసే సోలార్ రూఫ్టాప్ యూనిట్లను జిల్లాలోని ప్రతి మండలం నుంచి 15 చొప్పు న ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 19 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో ఈ యూనిట్ల ఏర్పాటుకు సం బంధించి సెర్ప్, మెప్మా ద్వారా అధికారులు దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించారు. 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్త్రీనిధి ద్వారా రూ.లక్ష రుణం అందిస్తుండగా సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.39,200 అందించనున్నది. అదేవిధంగా మూడు కిలోవాట్ల సా మర్థ్యం గల యూనిట్ ఏర్పాటుకు స్త్రీనిధి ద్వారా రూ. 1.25 లక్షలు రుణం రానుండగా ప్రభుత్వం రూ.57,360 సబ్సిడీ కింద ఇస్తుంది.