షాబాద్, డిసెంబర్ 26 : దేశంలో దోపిడీ లేని సమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ రంగారెడ్డిజిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. సీపీఐ 98వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని సోమవారం షాబాద్, కుర్వగూడ, నాగరకుంట గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కుల పీడన మతోన్మాదం, ఆర్థిక దోపిడీ విస్తృతంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎన్. జంగయ్య, సహాయ కార్యదర్శి రుక్కయ్య, నాగర్కుంట ఉప సర్పంచ్ రఘురాం, పార్టీ మండల నాయకులు రాములు, శ్రీశైలం, పాండు, పోచయ్య, నారాయణ, మధు పాల్గొన్నారు.
సీపీఐ ర్యాలీ
పెద్దఅంబర్పేట, డిసెంబర్ 26: సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పార్టీ మండల సమితి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్, మున్సిపాలిటీలోని కుంట్లూర్, రావినారాయణరెడ్డి కాలనీలో జెండాలు ఎగురవేశారు. మిఠాయిలు పంచారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, కౌన్సిలర్, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు పబ్బతి లక్ష్మణ్, వలంటీర్లతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించారు. భవిష్యత్తు ఎర్రజెండాదేనని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజ్ రవీంద్రాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, యాదగిరి, నర్సింహ, నారాయణ, శేఖర్, ప్రసాద్, అరుణ, నవనీత పాల్గొన్నారు.
పేదలకు అండగా సీపీఐ
మంచాల, డిసెంబర్ 26: పేదల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సీపీఐ కృషి చేస్తూ అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు కావలి నర్సింహ అన్నారు. సోమవారం మంచాల మండలం జాపాల, మంచాల, చీదేడు తదితర గ్రామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 98వ వార్షికోత్సవాల సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నర్ల శ్రీశైలం యాదవ్, అలీమద్దీన్, అనంతరెడ్డి, చంద్రకళ, పోచమోని నీళమ్మ, ఆంబోతు రాజు, మల్లయ్యగౌడ్, గాలయ్య, బాలయ్య, నర్ల భిక్షపతి, కాళ్ల సుందరయ్య పాల్గొన్నారు.
చేవెళ్ల మండల కేంద్రంలో..
చేవెళ్లటౌన్, డిసెంబర్ 26: భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి, ప్రభులింగం పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కను సన్నల్లో నడుస్తుందన్నారు. కార్పొరేట్లకు దేశ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెడతుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, ఏఐకేఎస్ రాష్ట్ర కౌల్సిల్ సభ్యుడు సుధాకర్గౌడ్, మండల పార్టీ కార్యదర్శి సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శి మక్బుల్, గీతాపని వాళ్ల సంఘం నాయకుడు లక్ష్మణ్గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.