మల్కాజిగిరి : అర్హులైన వారి ఓటు హక్కు కోల్పోకుండా చేయుతనందించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ( MLA Marri Rajasekhar Reddy ) అన్నారు. నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్పార్టీ బీఎల్ఏలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్( SIR ) కార్యక్రమానికి గడువు కొద్ది రోజులే ఉందని, గడువులోగా ప్రతి ఒక్కరికి ఓటు నమోదు పత్రాలు పూర్తిచేసే విధంగా సహకారం అందించాలన్నారు. పత్రాలు అందరికి అందేలా బీఎల్ఏలు సహకరించాలని సూచించారు.
సర్పై నిర్లక్ష్యం చేయవద్దని, ఎన్యుమరేషన్ పత్రాలు అందనివారికి, తగిన సమాచారం అందించి, వారి పత్రాలు అందేలా చూడాలన్నారు. ఇంటి చిరునామా మార్పు, డెత్, చేర్పులు, మార్పులు, 2002 డేటా, తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. బీఎల్ఓలు పారదర్శకంగా పనిచేస్తూ, ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యుమరేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేకల సునితా రాము యాదవ్, నేతలు జేఏసీ వెంకన్న, మేకల రాము, బైరు అనిల్, తదితరులు పాల్గొన్నారు.