అబ్దుల్లాపూర్మెట్ : ఫోన్ ఛార్జింగ్ పెట్టి తన బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి షాట్ సర్య్కూట్తో ఎలక్టానిక్ వస్తువులు దగ్దమయ్యాయి. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ గ్రామ పంచాయతీ యశోదనగర్లో చోటు చేసుకుంది. బాధితురాలు అంతటి వెంకటమ్మ కథనం ప్రకారం.. సాయంత్రం సమయంలో ఇనాంగూడలోని తన అక్కవద్దకు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి ఇంట్లో దగ్దమైన పోగతో మంటలు వ్యాపించాయి. గమనించిన ఇరుగు పోరుగు వారు స్తంభం నుంచి విద్యుత్ కనెక్షన్ను తొలగించారు.
మొదట సోపలో అంటుకున్న మంటలు తీవ్రంగా వ్యాపించడంతో టీవి, సీలింగ్ ఫ్యాన్, బట్టలు, సోపదిండు, పర్సులోని రూ. 8వేల నగదుతో పాటు ఇతర వస్తువులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్ యశోదఊషయ్యగౌడ్ దగ్దమైన ఇంటిని పరిశీలించారు. వెంకటమ్మకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. కాలనీలో కూరగాయలు అమ్ముకొని జీవనం సాగించే తనకు ప్రభుత్వ పింఛన్ కూడా రాదని, తనకు న్యాయం జరిగే ప్రభుత్వం చొరవతీసుకోవాలని విజ్ఞాప్తి చేశారు.