శంకర్పల్లి : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల రైతులను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలంలోని ప్రొద్దటూరు గ్రామ పంచాయితీ వద్ద జరిగిన రైతుబంధు సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో సమైఖ్యాంధ్ర పాలనలో ఎంతోమంది ముఖ్య మంత్రులు రాష్ట్రాన్ని పాలించారన్నారు. కాగా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆదుకోలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతుల గోస చూసి వారి కోసం రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తూ వారికి సాగుకు కావలసిన లాగొడిని అందిస్తున్నారని కొనియాడారు. కాగా 8 విడుతలుగా శంకర్పల్లి మండలంలో 20,220 మంది రైతులకు రూ. 143కోట్ల 6లక్షల 55,206లను అందించడం జరిగిందన్నారు.
ఇవే కాక రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతు అకాల మృతి చెందితే ఆ కుంటుంబానికి రూ. 5 లక్షలు అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచ్ ఏనుగు నర్సింహారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్, మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకట్రెడ్డి, ఏఓ సురేశ్బాబు, ఏఈఓ అనిత, నాయకులు జంగారెడ్డి పాల్గొన్నారు.