శంకర్పల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామ శివారులో పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వారు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నూతన దేవాలయాలు నిర్మించడం సంతోషకరం అన్నారు.
పెద్దమ్మ తల్లి ఆశీస్సులు జనవాడ గ్రామస్తులకు ఎల్లప్పుడు ఉండాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, సర్పంచ్ గౌడిచర్ల లలిత, ఎంపీటీసీ నాగేందర్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవిందర్గౌడ్, మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు గౌడిచర్ల నర్సింహా, మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు చేకుర్త గోపాల్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.