నందిగామ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ముఖ్య అతిథిగా షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నరని అన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకం, వ్యవసాయనికి ఉచిత కరెంటు వంటి కార్యక్రమాలతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంకగౌడ్, ఎంపీడీవో బాల్రెడ్డి, ఏవో శ్వేత, రైతు సంఘం నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.