షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని చటాన్పల్లి వివేకానంద కళాశాలలో కొనసాగుతున్న కేశంపేట మండలానికి సంబంధించిన మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలను గురువారం గురుకుల జాయింట్ సెక్రటరీ రమణారెడ్డి తనిఖీ చేశారు. ఇందులో భాగంగానే పాఠశాలలో భోజనాన్ని పరిశీలించారు. ప్రతి రోజూ ఏ విధమైనా భోజనాన్ని పెడుతున్నారనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకోవాలని, ఎలాంటి సందేహాలు ఉన్న ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశలను క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుభాన్ఖాన్, ఏటీపీ మంజుభార్గవి పాల్గొన్నారు.