షాద్నగర్ : దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జానంపేట వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న అమ్మవారికీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లక్ష పుష్పార్చాన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలంత సుఖసంతోషలతో ఉండాలని కోరకున్నానని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఇందులో భాగంగానే రైతు కాలనీలోని మైసమ్మ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గమాత అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, కౌన్సిలర్లు ప్రతాప్రెడ్డి, నాయకులు ఒగ్గు కిషోర్, జూపల్లి శంకర్, గుండు అశోక్, కొండె మల్లేశ్, వెంకటేష్గుప్తా, భువనేశ్, నార్ల శ్రీనివాసులు, శీలం శ్రీకాంత్ పాల్గొన్నారు.
వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో..
పట్టణంలోని వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ఫరూఖ్నగర్ మండలం దూసకల్ గ్రామంలో దుర్గమాత మండపం వద్ద పూజలు చేసిన అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.